మహిళా సంవృద్ధి యోజన – ఉద్యోగ వర్ధిని
జీవితంలో విజయాలు అనేవి అదృష్టం వల్ల కలిసిరావు, విజయాన్ని సాధించాలంటే కృషి, పట్టుదల అవసరం. అలాంటి కొందరు మహిళల విజయగాధలను మనం ఇప్పుడు చూద్దాం.
సులోచన అనే ఒక మహిళ తన మాతృత్వాన్ని నిలుపుకోవటం కోసం చాలా చోట్ల పని కోసం వెతికింది. అలాంటి మహిళ ప్రస్తుతం షోలాపూర్ లోని గణేష్ మార్కెటింగ్ అనే ఏజెన్సీని ప్రారంభించి లక్షల ఆదాయాన్ని గడిస్తుంది. అల్పన అనే మరో మహిళ అప్పడాల తయారీలో శిక్షణ పొంది మరో 500 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. రూపాయి సంపాదన కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వైష్ణవి అనే మహిళ నేడు నూతన హంగులతో కూడిన ఫ్యాషన్ బొతీక్ ప్రారంభించింది.
ఇలాంటి ఎందరో మహిళలు కనీస అవసరాలు తీర్చుకునే క్రమంలో వారికి సహాయ పడాలనే సత్సంకల్పంతో రాష్ట్రీయ సేవాభారతి, ధర్మకర్త అయిన చంద్రిక అనే మహిళ ఆధ్వర్యంలో ఉద్యోగ వర్ధిని అనే సంస్థని మహారాష్ట్రలోని సోలాపూర్లో 2004లో స్థాపించింది. చంద్రిక చౌహాన్ గారు 600 స్వయం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 10 వేల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించారు.
చంద్రిక చౌహాన్ గారు పూర్వ సంఘ ప్రచారకులైన శంభూ సింగ్ చౌహాన్ గారి శ్రీమతి. వీరు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజహితం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వీరు స్థాపించిన ఉద్యోగ వర్ధిని సంస్థ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (దీవ• ఔశీఎవఅ జుఅ•తీవజూతీవఅవబతీష్ట్రఱజూ తీశీస్త్రతీ•ఎ) అవార్డుని పొందింది.
భక్రి- జొన్న రొట్టె పల్లి పచ్చడి మహారాష్ట్ర వారి పసందైన వంటకం. ఉద్యోగ వర్ధిని ఈ వంటకాన్ని తమ ఉపాధిగా మార్చుకుని దాదాపు 800 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. వృద్ధులకి, రోగులకి పరిశుభ్రమైన ఆహారాన్ని రూపాయిన్నరకే అందజేస్తున్నారు. టైలరింగ్, క్యాటరింగ్, కుండల తయారీ, పాత బట్టలతో బ్యాగుల తయారీ, సాంప్రదాయ పిండి వంటలు తయారీ ఉద్యోగ వర్ధిని మహిళల ముఖ్యమైన పనులు. ఈ సంస్థకు సంబంధించిన మహిళలు స్వయం ఉపాధి బృందంలో సభ్యులుగా ఉంటారు.
చంద్రిక జి అహ్మదాబాద్ నుంచి సోలాపూర్ వచ్చినప్పుడు సామాన్య గృహిణి. ఆమె భర్తకి గుండె శస్త్ర చికిత్స కావడం వల్ల కుటుంబం గడవడం కోసం ఆమె టైలరింగ్ నేర్చుకుంది. డాక్టర్ కుకాడె గారి ప్రేరణతో తనతో పాటుగా ఇతర మహిళ లను వారి కాళ్లపై నిలబడేలా చేసింది. ఈ దిశగా ఆమె ప్రయాణం సోలాపూర్లో ఘొటేకర్ కాలనీలో చిన్న కుటీరంలో మొదలై అంచె లంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఉద్యోగ వర్ధినిలో రోజుకు 5000 రొట్టెలు తయారు చేసే రోటి మెషినరీ ఉన్నది. ఆ రొట్టెలను పాఠశాలలు, ఆస్పత్రులకు పంపిస్తారు. వీరి పిండి వంటలను విదేశాలకు కూడా పంపిస్తారు. అంధులు తయారుచేసిన వస్తువులనూ ఈ సంస్థ ద్వారా విక్రయింపచేస్తోంది.
సమాజం పట్ల సున్నితత్వం ఉద్యోగ వర్ధిని ముఖ్య ఉద్దేశం. ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా సమాజం పట్ల అవగాహన, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ఉద్యోగ వర్ధిని ముఖ్య ఉద్దేశం. జాతీయ సేవా సంస్థ సీనియర్ ప్రచారకులు అయిన ఉదయ్ జోగెల్కర్ గారు వారి మాటల్లో ఉద్యోగ వర్ధిని విజయం వల్ల ‘‘వైభవ శ్రీ’’ అనే కొత్త కార్యక్రమం మహిళా అభ్యుదయానికి సేవాభారతిలో ప్రారంభించారు.