43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక అని అన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని తెలిపారు. తమ హయాంలో భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని ప్రకటించారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల  ద్వారా ఎరువులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామని, రైతులకు పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా చేస్తామన్నారు.

వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇలా…

1. వ్యవసాయ శాఖ : 8,564.37 కోట్లు

2. భూసార పరీక్షలు : 38.88 కోట్లు

3. రాయితీ విత్తనాలు : 240 కోట్లు

4. విత్తనాల పంపిణీ : 240 కోట్లు

5. పొలం పిలుస్తోంది కార్యక్రమం : 11.31 కోట్లు

6. పంటల బీమా : 1,023 కోట్లు

7. ప్రకృతి వ్యవసాయం : 422.96 కోట్లు

8. డిజిటల్ వ్యవసాయం : 44.77 కోట్లు

9. వ్యవసాయ యాంత్రీకరణ : 187.68 కోట్లు

10. వడ్డీలేని రుణాలు : 628 కోట్లు

11.అన్నదాత సుఖీభవ : 4,500 కోట్లు

12. రైతు సేవా కేంద్రాలు :26.92 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *