మహిళలకు వారు కోరుకున్నది చేసే స్వేచ్ఛ ఇవ్వండి : మోహన్ భాగవత్ సలహా

సమాజాన్ని ఉద్ధరించాలనే ఆలోచన సహజంగానే మాతృ ప్రేమతో కూడిన మాతృ శక్తికి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. కాబట్టి, ఈ శక్తి స్థాపించబడినప్పుడు, దేశం ఖచ్చితంగా పురోగమిస్తుంది అని వారు చెప్పారు.హుతాత్మ స్మృతి మందిర్‌లో నిర్వహించిన ఉద్యోగవర్ధిని సంస్థ ‘పరివార్ ఉత్సవ్’ కార్యక్రమంలో సరసంఘచాలక్ ప్రసంగించారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ఈ సంస్థ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈకార్యక్రమంలో, జిల్లా మేజిస్ట్రేట్ కుమార్ ఆశీర్వాద్, సంస్థ సలహాదారు రామ్ రెడ్డి, ఉద్యోగవర్ధిని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు చంద్రికా చౌహాన్ ,కార్యదర్శి మేధా రాజోపాధ్యాయ పాల్గొన్నారు.
మహిళలకు వారు కోరుకున్నది చేసే స్వేచ్ఛ ఇవ్వండి
మేము మహిళలను ఉద్ధరిస్తున్నామంటూ పురుషులు అహంకారాన్ని ప్రదర్శించకూడదని డాక్టర్ మోహన్ భగవత్ జీ సలహా ఇచ్చారు. “స్త్రీలు చేయగలిగే పని, పురుషులు చేయలేరు. కాబట్టి, స్త్రీలు తమ ఇష్టానుసారం పని చేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. దీని కోసం, అన్యాయమైన బంధనాల నుండి వారిని విముక్తి చేయాలి.” ఒక సాధారణ ప్రజల అసాధారణ పనితీరు కారణంగా ఉద్యోగవర్ధిని సంస్థ ఏర్పడింది. దాని సాధికారత ,ప్రేరణను స్పూర్తిగా తీసుకుని ఇతర ప్రదేశాలలో ఉద్యోగవర్ధిని వంటి సంస్థలను స్థాపించాలని సర్సంఘచాలక్ సంస్థకు పిలుపునిచ్చారు.
సంఘ్ పనికి సాన్నిహిత్యమే ప్రేరణ – మోహన్ భాగవత్
బీహార్ కరువు సమయంలో సంఘ్ స్వయం సేవకులు చేసిన కృషికి జయప్రకాష్ నారాయణ్ ఉప్పొంగిపోయారు. ఆయన ఢిల్లీలోని సంఘ శిబిరాన్ని సందర్శించి సంఘ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న స్వయం సేవకులను కలిశారు.. జయప్రకాష్ జీ స్వయం సేవకులను ‘మీ పనికి ప్రేరణ ఏమిటి?’ అని అడిగారు. అప్పుడు స్వయం సేవకులు ‘సమాజంలో ఉన్న బాధలే మాకు ప్రేరణ’ అని అన్నారు. సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, “సంఘ్ పనికి మనకు మనమే ప్రేరణ” అని అన్నారు. సాన్నిహిత్యంతో కలగలిసిన ప్రేరణతో చేసే పని నిరంతరాయంగా కొనసాగుతుంది. అహాన్ని తొలగించి, సమాజంలోని బాధితుల బాధలను సులభంగా తొలగించడం మన కర్తవ్యం. మొత్తం సమాజం స్వార్థం, వివక్షతను మరచిపోయి ఇలాగే పనిచేస్తే, దేశం తలరాత మారుతుంది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగవర్ధిని ఆధారంగా ‘అఖండ యాత్ర’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అలాగే, నయన్‌బెన్ జోషి రాసిన , సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కర్మార్కర్ సంపాదకత్వం వహించిన ‘ఉద్యోగవర్ధిని కి సేవావృతి’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. సంస్థ పనిని సమీక్షిస్తూ, రామ్ రెడ్డి మాట్లాడుతూ, “ఉద్యోగవర్ధిని కష్టపడుతున్న మహిళల జీవితాలను ప్రకాశవంతం చేయడానికి పనిచేస్తుంది. ఇది పరిశ్రమ ఆధారంగా నిరుపేద మహిళలను వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా సాధికారపరిచే ప్రక్రియ. ఉద్యోగవర్ధిని షోలాపూర్‌లోనే కాకుండా మహారాష్ట్రలోని మహిళలకు కూడా మద్దతు ఇచ్చే సంస్థగా అభివృద్ధి చెందుతోంది” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *