కాషాయ ధ్వజం ఎగిరింది.. రామరాజ్య జెండా తిరిగి ప్రతిష్ఠితమైంది : మోహన్ భాగవత్

రామ జన్మభూమి అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం అత్యంత వైభవోపేతంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అయోధ్య రామాలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగరేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీ బేన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు సాధు సంతులు, ప్రముఖులు పాల్గొన్నారు.
mohan ji2
ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ ‘‘మనందరికీ ఈ రోజు సార్థకమైన రోజు. దీని కోసం ఎంత మంది అయితే ప్రాణ త్యాగం చేశారో వారి వారి వారి ఆత్మలు సంతృప్తి చెందాయి. ఈ రోజు మందిరానికి సంబంధించి ధ్వజారోహణ పూర్తైంది. మందిరానికి సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియ కూడా మొత్తం పూర్తైంది. ఎందరో మంది ఈ స్వప్నాన్ని ఆకాంక్షించారు. తమ ప్రాణాలను ఇచ్చారు.చాలా మంది ప్రయత్నాలు కూడా చేశారు. ఈ రోజు స్వర్గంలో వున్న వారి ఆత్మ తృప్తి చెందిందని అనుకుంటున్నా. నేడు వాస్తవానికి అశోక్ సింఘాల్ కి అక్కడ శాంతి లభించింది. అలాగే మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్.. ఇలా ఇంత మంది సాధుసంతులు, గృహస్థులు, విద్యార్థులు… ఇలా ఎందరో తమ ప్రాణత్యాగాలు చేశారు.అలాగే ఎందరో తమ చెమటను ధారగా బోశారు. వెనకుండి నడిపించిన వారు కూడా మందిర నిర్మాణం జరగాలి, జరగాలి, అని కోరుకున్నారు. నేడు రామ మందిర నిర్మాణ శాస్త్రీయ ప్రక్రియ పూర్తైంది. ధ్వజారోహణ జరిగింది. ఇది రామ రాజ్య ధ్వజం. అప్పట్లో అయోధ్యలో ఈ ధ్వజమే రెపరెపలాడేది. సంపూర్ణ విశ్వానికి సుఖశాంతులను ప్రసాదించేది. ఆ ధ్వజమే మళ్లీ మరోసారి కింది నుంచి పైకి ఎగిరి, శిఖరంపై ఎగురుతోంది. ఈ కళ్లతో, ఈ దేహంతో మనమందరమూ చూశాం. ధ్వజం అనేది ప్రతీక. ఇంత పెద్ద ధ్వజం ఆలయ శిఖరం పైకి ఎగరేయడానికి సమయం పట్టింది. మందిర నిర్మాణానికి కూడా సమయం పట్టింది. ఈ మందిరం రూపంలో కొన్ని తత్వాలను మనం పైకి పంపించాం.
ప్రపంచం మొత్తం దేనిని ఆధారంగా చేసుకొని నడుస్తుందో, వ్యక్తిగత జీవనంతో పాటు అందరి జీవితాలను సవ్యంగా నడిపించే ధర్మం, ఆ ధర్మానికి ప్రతిరూపం కాషాయ రంగు. ఈ ధ్వజం రంగు కూడా కాషాయమే. అందుకే ఇది ధర్మ ధ్వజం. దానపై కోవిదార వృక్షం వుంది. ఇది రఘుకులానికి ప్రతీక. అలాగే మందార, పారిజాత వృక్షాలు కూడా వున్నాయి. వీటిని దేవతా వృక్షలు అని పిలుచుకుంటాం. ఇది కచ్నార్ చెట్టును పోలి ఉంటుంది. ఇది మందర్ మరియు పారిజాత చెట్ల లక్షణాలను మిళితం చేస్తుంది. చెట్లు ఎండలో వుండి, ఇతరులకు నీడనిస్తాయి. తమకు పండిన ఫలాలను ఇతరులకే ఇస్తాయి. “వృక్షః సత్పురుషః ఇవ” అంటే చెట్లు మంచి వ్యక్తుల లాంటివి.మనం అలాంటి జీవితాన్ని గడపాలనుకుంటే, ఎంత కష్టాలు ఎదురైనా, వనరుల కొరత ఉన్నా, ప్రపంచం స్వార్థంతో కొట్టుకుపోయినా, మనం మత మార్గాన్ని అనుసరించాలనేది మన సంకల్పం.కచ్నార్ ఔషధ గుణాలను కలిగి ఉంది మరియు దీనిని ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అన్ని కోణాల్లో ఉపయోగకరమైన ఈ చిహ్నం ధర్మానికి సంకేతం. ధర్మానికి పర్యాయపదం. సూర్య భగవానుడు ధర్మానికి తేజస్సు. మరియు సంకల్పానికి ప్రతీక. అతని రథానికి ఓ చక్రం వుంది. మార్గమా లేదు. ఏడు గుర్రాలు, పాము కపాలంతో నియంత్రించబడే దండం. రథసారథికి కాళ్లు లేవు.అలాంటి వాహనం కదలగలదా? అయినప్పటికీ వారు ప్రతిరోజూ తూర్పు నుండి పడమరకు అలసిపోకుండా ప్రయాణిస్తారు. పని సాధించడం స్వయం సమృద్ధి.’’ అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *