‘‘ఇది మనమంతా గర్వించాల్సిన సమయం’’ : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. తన కేబినెట్ సహచరులతో సమావేశమైన సమయంలో స్పందించారు. ‘‘ఇది మనమంతా గర్వించదగిన సమయం’’అని పేర్కొన్నారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపాయని పేర్కొంటూ ప్రశంసించారు. పాక్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్ లో నాలుగు చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఐదు చోట్ల సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ప్రధాని మోదీ కేబినెట్ సహచరులకు వివరించారు.

భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే క్యాబినెట్ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేసారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా కచ్చితంగా అమలు చేశారని, ప్రతీకారదాడులు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. ముందస్తుగానే సమగ్రమైన సన్నాహకాలు అనుకున్నది అనుకున్నట్లుగానే మిషన్ నిర్వహించిందన్నారు. ఆర్మీ ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించిందని మోదీ ప్రశంసించారు. యావద్దేశం మనవైపు చూస్తోందని, ఆర్మీ మనకు గర్వకారణంగా నిలిచిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *