2 లక్షల మంది ముస్లిం బాలలు అదృశ్యం!

– దేవేంద్ర గుప్తా, హైకోర్టు న్యాయవాది, ప్రయాగరాజ్‌

ఇటీవల మాజీ ఉపాధ్యక్షుడు హమీద్‌ అన్సారీ దేశంలోని ముస్లింలలో అశాంతి, అభద్రతా భావం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. హమీద్‌ అన్సారీ లాంటి వాళ్లలో అభద్రతా భావం ఎందుకు ఉందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఒక సంచలన వార్త రుజువు చేసింది. ఉత్తరాఖండ్‌లోని మదర్సాలలో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది ముస్లిం పిల్లలు రాత్రికి రాత్రే అదృశ్యమైనట్లు సమాచారం.

 మొత్తం వార్త తెలిస్తే, మీ కాళ్ళ కింద నేల కూడా కదిలిపోతుంది. వాస్తవానికి గత 50- 60 ఏళ్లుగా మదర్సాలలో చదువుతున్న పిల్లలకు ప్రభుత్వం ప్రతినెలా స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. అయితే ఈ చిన్నారుల బ్యాంకు ఖాతాలను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కోరిన వెంటనే 1,95,360 మంది పిల్లలు తక్షణమే అదృశ్యమయ్యారు. ఎలా?

ఇప్పటి వరకు లేని ఈ విద్యార్థుల పేరుతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక్క ఉత్తరాఖండ్‌ లోనే సుమారు రూ.14.5 కోట్ల స్కాలర్‌షిప్‌లను  పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కేవలం 2 కోట్లకు ఆ సంఖ్య తగ్గింది. దీనినిబట్టి 50-60 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు!!!

 వాస్తవానికి, ఈ 1,95,360 మంది పిల్లలు అసలు లేనేలేరు.  పిల్లల తప్పుడు పేర్ల ఆధారంగా మదరసాలు ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుంటు న్నారు. ఇంతకుముందు ప్రభుత్వం  ఏళ్లతరబడి డబ్బులు దోచుకుని మదర్సాల కమిషన్‌ సొమ్ము కింది నుంచి పైవరకు పంచింది.  ఇది ఒక్క ఉత్తరాఖండ్‌కు సంబంధించిన విషయం కాదు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం దగ్గర రిజిస్టర్‌ చేసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మదర్సాలను కోరినప్పుడు ఎంత రచ్చ ఎందుకు జరిగిందో ఇప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం మారిన తర్వాత ముస్లింలు ఎందుకు ‘అభద్రతా భావానికి’ గురవుతున్నారో ఇది రుజువు చేసింది. ఎందుకంటే వారు ఆర్థిక వ్యవస్థకు సహకరించకుండా పన్నులు చెల్లించడం లేదు. నిజాయితీగల పౌరులు చెల్లించే పన్ను డబ్బును కూడా దోచుకుంటున్నారు.

 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు. ఉత్తరాఖండ్‌లో 2,21,800 మంది ముస్లిం విద్యార్థులు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారు. వారి అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానించిన వెంటనే, వారి సంఖ్య 26,440కి పడిపోయింది. అంటే 88% తగ్గింది. ఇది బిపిఎల్‌ విద్యార్థులకు అంటే దారిద్య్ర రేఖకు దిగువన, చాలా పేద కుటుంబాలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌.

ఆధార్‌ లేని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక నిబంధనను కూడా తీసుకువచ్చింది, అలాంటి విద్యార్థులు స్కాలర్‌షిప్‌ ప్రయోజనం కూడా పొందుతున్నారు. అయితే దీనికోసం వారు తప్పనిసరిగా జిల్లా మేజిస్ట్రేట్‌ ద్వారా ధ్రువీకరణ పొందాలి. అయితే వారు అసలు భౌతికంగా లేనప్పుడు ధృవీకరణ ఎలా ఉంటుంది? నకిలీ మదర్సాలు, నకిలీ విద్యార్థులు, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం!! నకిలీ పేర్లతో ఏళ్ల తరబడి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు.

విద్యార్థులను పక్కన పెట్టండి. ఇక్కడ చాలా మదర్సాలు కూడా కాగితంపై మాత్రమే నడుస్తున్నాయి. వాస్తవానికి, మదరసాలు చాలా మటుకులేవు. వాటిలో విద్యార్థులు ఎవరూ చదవలేదు. నకిలీ విద్యార్థుల పేర్లను పంపి ప్రభుత్వ నిధులను హాయిగా పొందుతున్నారు. ఆశ్చర్యకరంగా ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఒక్క ముస్లిం విద్యార్థి కూడా స్కాలర్‌షిప్‌ తీసుకోవడానికి రాలేదు.

ఉత్తరప్రదేశ్‌లో ఇంకా చాలా జరుగుతోంది. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని, అలాగే అనేక మదర్సాలలో పిల్లలకు రాడికల్‌ విద్యను కూడా అందిస్తున్నారని నిఘా వర్గాలు కూడా అప్రమత్తం చేశాయి. ఇలాంటి అవాంతరాల దృష్ట్యా, ముఖ్యమంత్రి యోగి అన్ని మదర్సాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశారు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్న సుమారు 800 మదర్సాలపై సంవత్సరానికి రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తుంది. వీటిలో దాదాపు 8-10% మదర్సాలు భౌతికంగా ఉన్నాయి. ఈ మదర్సాలలో కేవలం 12% మంది విద్యార్థులు మాత్రమే భౌతికంగా ఉన్నారు. మిగిలినవి నకిలీ పేర్లతో దోచుకునే పన్ను. డబ్బు. అందుకే ఈ అణచి వేత వల్ల అవినీతిపరులు రెచ్చిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *