’50 ఆయుధాలకే పాక్ తోకముడిచింది’ : వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్
పాకిస్థాన్ సైనిక లక్ష్యాలపై భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలు ప్రయోగించిందని వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ అన్నారు. దాంతో మే 10 నాటికి యుద్ధం ముగింపు పలకాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మే 9, 10 తేదీల మధ్య పాక్పై జరిపిన దాడుల్లో భారత వైమానిక దళం పూర్తి అధిపత్యం సాధించగలిగిందని తెలిపారు. ఓ జాతీయ మీడియా సదస్సులో ఆపరేషన్ సిందూర్కు సంబంధించి సరికొత్త విషయాలను ఆయన పంచుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎఫ్ అధికారి నర్మదేశ్వర్ తివారీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి వివరించారు. అత్యంత కచ్చితత్వంతో పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళాలు విరుచుకుపడ్డాయని ఆయన తెలిపారు. దీంతో దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అందుకు భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలనే ప్రయోగించిందని వెల్లిడించారు.