మావోయిస్టు ప్రాంతాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

అత్యంత మావోయిస్టు ప్రభావితాల్లో గణతంత్ర దినోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. బీజాపూర్, సుక్మా, కంకేర్, కొండపల్లి, కౌరగట్టు, జీడిపల్లి, నారాయణపూర్ జిల్లాలోని 26 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ మావోయిస్టులకు పట్టున్న దండకారణ్యం పరిధిలోకి వస్తాయి. ఇంత వైభవంగా, ఘనంగా ఆ ప్రాంతాల్లో జాతీయ పతాక ఆవిష్కరణలు జరగడం ప్రథమమని పేర్కొంటున్నారు.కేంద్ర బలగాల అధికారులు భారీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి స్థానికులకు జాతీయ జెండా ఎగుర వేస్తున్న దృశ్యాలు చూపించారు. అలాగే స్థానిక విద్యార్థులతో ర్యాలీ కూడా నిర్వహించారు.

ఈ ప్రాంతాల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య తరుచుగా ఎన్ కౌంటర్లు జరుగుతుంటాయి. దీంతో వనవాసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఈ మధ్య ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. దీంతో వనవాసులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో తొలిసారి జాతీయ జెండా ఎగరేశారు. దీనికి సీఆర్పీఎఫ్ 74 వ బెటాలియన్ నాయకత్వం వహించింది.పిల్లలు, పెద్దలతో సహా అందరూ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *