కార్పొరేట్ జిహాద్ కేసు : నిదాఖాన్ అరెస్ట్
నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితురాలిగా వుంటూ, పరారీలో వున్న నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 7 న నాసిక్ పోలీసులు ఛత్రపతి శంభాజీ నగర్ లో అరెస్ట్ చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్, సిట్ బృందం సమాచారం మేరకు, ఛత్రపతి శంభాజీ నగర్ పోలీసుల సహాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లోనే ఆమె అరెస్ట్ అయ్యారు. దీంతో పోలీసులు శుక్రవారం ఆమెను నాసిక్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
అయితే నిదా ఖాన్ కి ఇన్ని రోజుల పాటు ఆశ్రయం ఎవరిచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఆలిండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM) ప్రముఖ నేత ఇంతియాజ్ జలీల్ కి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది.
నాసిక్ లోని టీసీఎస్ లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నట్లు నిదా ఖాన్ పై ఆరోపణలున్నాయి. అక్కడి ఉద్యోగులు కూడా నిదా ఖాన్ చేసిన పనులను వెలుగులోకి తెస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిదాఖాన్ పరారీలో వున్నారు. గత 25 రోజులుగా ఆమెఅజ్ఞాతంలో ఉన్నారు.ఈమెను పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి, విస్తృతంగా గాలించారు.