ముగిసిన నిజాం నిరంకుశ పాలన.. పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు

నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు

భాగం-4    

భైరవునిపల్లి, లింగాపూర్‌ గ్రామాలపై జరిగిన రాక్షసదాడులను చూసి జనగామ ప్రజలు నిజాం ప్రభుత్వాన్ని విపరీతంగా అసహ్యించుకున్నారు. కాని నిజాం మాత్రం విదేశాల నుండి పత్రికా విలేఖరు లను వేలరూపాలయలు ఖర్చుచేసి రప్పించి భైరవుని పల్లి సంఘటనలను మరోరకంగా వక్రంగా చిత్రించి విదేశాల్లో ప్రచారం చేశాడు. అసలు హిందువులే తిరగబడి దాడికి తలబడితే తాము శాంతి భద్రతలను కాపాడడానికి ఆ చర్య తీసుకున్నామని ప్రచారం చేశాడు. అయినా ప్రజల రక్తపాతం నిజాం అమానుష చర్యల నిజస్వరూపం ప్రపంచా నికి బహిర్గతం కాక తప్పలేదు.

గోర్ట గ్రామంలో ఈనాటికీ సజీవంగా ఉన్న 80 సంవత్సరాల వృద్ధుడు శ్రీ ఇరశెట్టిప్ప వంకే మాటల్లో చెప్పాలంటే ఆనాడు నిజాం గ్రామాలను పీల్చి పిప్పిచేశాడు.1928 నుండి 1948 వరకు అంటే 20 సంవత్సరాలు హిందువులను బానిసలుగా చేసి వారి కష్టార్జితాన్ని దోచుకున్నాడు. ఎదురుతిరిగిన వాళ్లను భూస్థాపితం చేశాడు. గోర్టలో జరిగిన మొదటి పోరాటంలో శ్రీ వంకే జుల్మానాతోపాటు సంవత్సరం జైలుశిక్ష అనుభ వించాడు. నిజాం సర్వస్వతంత్రుడుగా ప్రకటించుకో గానే ప్రతి ముస్లిం తానే పాలకుడైనట్లు వ్యవహ రించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు గ్రామాల్లో నిరంకుశాధి కారాన్ని వెలిగించారు. అనేక గ్రామాలతో పాటు హుయనాబాద్‌, కళ్యాణ్‌, బాల్కీ, రాజేశ్వర్‌, ఘోడవాడి, సాయిగావ్‌, మెహేకర్‌ మొదలైన గ్రామాల్లో ముస్లిం గ్రామాధికారులు ఇష్టానుసారం హిందువులను పీడిరచటం మొదలు పెట్టారు. ఎదురైన ప్రతి హిందువుని ఇంట్లోకి చొరబడి అమానుషంగా బయటకులాగి తలను నరికివేయటం మొదలైంది.

ఆ ఘోర హింసాకాండను వర్ణించడం సాధ్యం కాదు. ఒక ఇంట్లోని మగవాళ్లనందరిని లాగి నరకటం ప్రారంభించారు. మిగిలిన ఒక తమ్ముడ్ని కూడా బయటకు లాగి కిందపడవేసేసరికి గర్భవతిjైున అతని అక్క అతనిపై బడి రోదించ సాగింది. రాక్షసులైన హంతకులు పాశవికమైన పద్ధతిలో ఆమెను ఈడ్చి నడుముపై తన్నారు. ఆమె అక్కడే ప్రసవించి చనిపోయింది. ఆనాడు బ్రతికి బయటపడ్డ పిల్లవాడు ఈనాటికి ‘‘బాబు’’ అనే పేరుతో సజీవంగా ఉన్నాడు. గ్రామంలో ఆ రోజు పాశవిక పాలన సాగింది. రాక్షసమైన ప్రవృత్తితో కనబడిన ప్రతి స్త్రీపై అత్యాచారం చేశారు. ఎంతో మంది స్త్రీలు రజాకార్ల కామానికి బలైపోయారు. ఎవరూ ఆ రాక్షస చర్యలను అడ్డుకొనేవాళ్లు కనపడలేదు. ఆ ఒక్కరోజు హత్యకావింపబడిన యాభైమందిలో కొంతమంది పేర్లు ఇవి.. అనిరుద్దప్ప, ములుశెట్టి, జగబెట్టి, శివప్ప, ధన్‌గర్‌, శివప్పమైత్రి, మారుతి అప్పకొనే, ధూలప్ప కణజే, రామారావు పటజే, గురప్ప కణజే, భీమన్న రాజోలె, శరణప్ప కనకటీ, చిన్నప్ప బరాదర్‌, గురప్ప బరాదర్‌, కాశప్ప మధుకంటి, విరూపాక్షప్ప మఠపతి, బసవప్ప వంకే మొదలైనవాళ్లు.

ఇస్లామ్‌ ఆసఫియా సామ్రాజ్యాన్ని (సల్తనతే – ఆసఫియా ఇస్లామియా) స్థాపించాలని కలలుగన్న నిజాం 1947 తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని మహా ఘనత వహించిన (హిజ్‌ మెజెస్టీ) ప్రభువుగా మారిపోయాడు. సర్వ స్వతంత్రమైన భారతదేశం నడిబొడ్డులో స్వతంత్ర ప్రతిపత్తికోసం ప్రాకులాడిన నిజాం ప్రజలపై క్రూర దమనకాండను అమలు జరిపాడు. ముస్లిం మత ప్రాబల్యాన్ని పెంచి ఇత్తెహాదుల్‌ సంస్థ అండతో రజాకార్ల గూండా చర్యలతో తన అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించాడు. చివరికి బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ కూడా స్వతంత్ర హైదరాబాద్‌ను సమర్థించాడు.

యూరప్‌లో బఫర్‌స్టేట్‌గా ఉన్న స్విట్జర్లాండ్‌ పద్ధతిలో హైద్రాబాద్‌ సంస్థానం ఉండవచ్చునని వాదించాడు. రజాకార్ల సైన్యాధి పతిగా ఖాసిం రజ్వీ చివరికి నిజాం తలపై భస్మాసుర హస్తంలా పరిణమించాడు. రజ్వీ తనను తాను ఫీల్డ్‌ మార్షల్‌ రోమెల్‌ జుకాఫ్‌ మాంటే గుసరీలాంటి ప్రఖ్యాత సైన్యాధిపతిగా ఊహించుకొని విర్రవీగిపోయాడు. ఒకసారి రజ్వీ ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ను కలుసుకొని హైద్రాబాద్‌ స్వతంత్రంగా ఉంటుందని చెప్పాడు. సర్దార్‌ పటేల్‌ ఒకే ఒక్క మాటలో ఇలా అన్నారు ‘‘ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాణ్ణి ఎవరూ ఆపలేరు’’. తర్వాత రజ్వీ విషపూరితమైన ఉపన్యాసాలవల్ల ముస్లింలను రెచ్చగొట్టాడు. ఢల్లీి రాజధానిని వశం చేసుకొని ఎర్రకోటపై ఆసఫియా జెండాని ఎగురవేస్తానని డంబాలు పలికాడు. కాని భారత సైన్యం ప్రవేశించిన మూడు రోజులకే నిజాం సైన్యం, రజాకార్లు ఆయుధాలు దించేసి మోకరిల్లారు. నిజాం తప్పునంతా రజ్వీపైన, రజాకార్లపైన మోపి తాను ధూర్తుడిగా లొంగిపోయాడు. పోలీసు యాక్షన్‌ తర్వాత ఖాసిం రజ్వీని ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. సవివరంగా హంతకుడిగా, దోపిడీ దొంగగా రజ్వీ న్యాయస్థానంలో నిలుచున్నాడు. న్యాయస్థానం రజ్వీకి ఏడు సంవత్సరాలు కఠిన కారాగారశిక్షను విధించింది. మామూలుగా ప్లీడరు నుండి ఫీల్డ్‌మార్షల్‌గా తనను తాను నిలుపుకొన్న రజ్వీ దోపిడీ దొంగగా నిజస్వరూపాన్ని చూపుకోక తప్పలేదు. గూఢచారి విభాగం అధికారి శ్రీ నర్సింగ్‌ ప్రసాద్‌ కృషివల్ల స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు దొరికాయి. ఫలితంగా ఖాసిం రజ్వీ తానుచేసిన నేరాలకు కఠిన శిక్షను అనుభవించాడు.

హైద్రాబాద్‌ సంస్థానం విలీనం కాకుండా ఉండాలని నిజాం, ముస్లిం మజ్లిస్‌, నియంత ఖాసిం రజ్వీ ఇక్కడ ప్రజలను మభ్యపెడుతూ నాటకం ఆడారు. హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లులాంటి వారని వాళ్లిద్దరూ తన కళ్లులాగానే ప్రీతిపాత్రులని హైద్రాబాద్‌ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేసే పక్షంలో హిందువులు బాధపడతారు. భారత్‌లో విలీనం చేయటం ముస్లింలకు ఇష్టం లేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో తన రాజ్యం స్వతంత్రంగా ఉండటమే మంచిదని నిజాం తెలివిగా ప్రకటించారు. తన రాజ్యకాంక్షను, మత దురహంకారాన్ని కప్పి పుచ్చి ఒక ప్రత్యేక ఫర్మానా ద్వారా స్వతంత్రాన్ని చాటుకున్నాడు. అయితే వాస్తవం మరోవిధంగా ఉంది. ఈ సంస్థానంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువులు తమ ప్రాంతాన్ని మత ప్రమేయంలేని స్వతంత్ర భారత్‌లో విలీనం చేసి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రగాఢంగా కోరుతున్నారు. హైద్రాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఈ ఆశయ సాధనకోసం సంఘర్షణ జరుపుతూ ఉంది. ఈ ప్రజావాంఛను, వాస్తవాన్ని అణచిపెట్టాలని నిజాం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. తనకు అన్ని విధాలా సహాయంగా ఉండాలని ఇత్తేహాదుల్‌ ముసల్‌మీన్‌ అనే మత సంస్థను పోషించాడు. ఖాసిం రజ్వీ దాని నాయకుడుగా అండగా ఉన్నాడు. నిజాం తన సైన్యాన్ని మరింత సాయుధం చేసి ప్రజా ఆందోళనలను నిరంకుశంగా అణచి వేయాలని సిద్ధంగా ఉన్నాడు.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *