జాతీయ భదత్రా సలహాదారుగా అజిత్‌ దోవల్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా నృపేన్‌ మిశ్రా తిరిగి నియామకం

జాతీయ భదత్రా సలహాదారుగా అజిత్‌ దోవల్‌ తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా నృపేన్‌ మిశ్రాను కూడా మోదీ తిరిగి నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగుతారని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయ భదత్రా సలహాదారునిగా అజిత్‌ దోవల్‌ తప్పుకోనున్నారని, ఆ పదవికి ఆయన రాజీనామా చేస్తారని సోషల్‌ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ప్రధాని మోదీ తాజా నిర్ణయంతో ఈ పుకార్లకు చెక్‌ పెట్టినట్లైంది. అజిత్‌ దోవల్‌ 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా తిప్పికొట్టే ఆపరేషన్లలో దోవల్‌ దిట్టగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇంటెలిజెన్స్‌ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కూడా దిట్ట. మరోవైపు పీకే మిశ్రా 1972 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితునిగా పేరు గడిరచారు. పరిపాలనా వ్యవహారాల్లో అత్యంత దక్షునిగా పేరు గడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *