మోదీ లాంటి నేత పాకిస్తాన్ కి కూడా అత్యంత అవసరం
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతోంది. పాకిస్తాన్ కి కూడా మోదీ లాంటి నేత అత్యంత అవసరం. భారత్ దూరదృష్టితో గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలాలు అందిస్తున్నాయి. భారత్ తో పాటు అమెరికాలో పనిచేసే భారతీయులకు మోదీ ఇచ్చిన జాతీయవాద నినాదం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. కొన్ని కీలక రంగాల్లో భారతీయులదే పైచేయి. వాషింగ్టన్ లో ఇది స్పష్టంగా గోచరిస్తోంది కూడా. టెక్ దిగ్గజాల పెరుగుదల ప్రవాస భారతీయులను మరింత బలోపేతం చేస్తుంది. దీని నుంచి పాక్ పాఠాలు నేర్చుకొని, విద్యపై ఎక్కువ దృష్టి సారించాలి.
-పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్