‘‘కర్తవ్య భవన్’’ ప్రారంభం… పూర్తి ప్రత్యేకతలివే..

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.కర్తవ్యభవన్‌లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు.కర్తవ్య భవన్‌ లోకి దశలవారిగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్‌ బ్లాక్‌ నుంచి కర్తవ్య భవన్‌ లోకి మార్చారు.

ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి, వందేళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది. ఈ క్రమంలోనే మరికొన్ని కీలక పాలన కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారనున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఇప్పటి వరకు రైసీనా హిల్స్‌పై కొలువైన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో ఉండే ప్రధాని కార్యాలయం సహా రక్షణశాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ మంత్రిత్వ శాఖలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ కానున్నాయి. వాటిని కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్‌కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

6 అంతస్థులు, 1.5 లక్షల చదరపు మీటర్లు…

6 అంతస్థులు ఈ భవనంలో వున్నాయి. 1.5 లక్షల చదరపు మీటర్లు వుంది. ఇఈ కర్తవ్య భవన్‌లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, MSME మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి.

విస్తృత పరిపాల సంస్కరణల కార్యక్రమానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రతీక. మంత్రిత్వ శాఖల సమన్వయం, అత్యాధునిక మౌలిక సదుపాయాల వినియోగం ద్వారా అంతర-మంత్రిత్వ సమన్వయాన్ని సార్వత్రిక కేంద్ర సచివాలయం మెరుగుపరుస్తుంది. తదనుగుణంగా విధానాల అమలు వేగవంతం కావడమేగాక స్పందనాత్మక పాలనావరణ సృష్టికి దోహదం చేస్తుంది.

ప్రస్తుతం కీలక కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అధికశాతం 1950-1970 దశకాల మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్ వంటి పాత భవనాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, ఇవి బాగా పాతబడి, శిథిలస్థితికి చేరుతున్న నేపథ్యంలో కొత్త భవన సముదాయంతో కొత్త సౌకర్యాల కల్పన, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ఉత్పాదకత, ఉద్యోగుల శ్రేయస్సు సహా అన్నిరకాల సేవల ప్రదానం మొత్తంగా మెరుగుపడుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లోగల వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కర్తవ్య భవన్-03 ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా సామర్థ్యం, ఆవిష్కరణలు, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అత్యాధునిక కార్యాలయ సముదాయం రెండు బేస్‌మెంట్లు, 7 అంతస్తులు (గ్రౌండ్ + 6)లతో దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఇందులో దేశీయాంగ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, ‘ఎంఎస్‌ఎంఈ’, ‘డీవోపీటీ’, పెట్రోలియం-సహజ వాయు మంత్రిత్వ శాఖలు-విభాగాల కార్యాలయాలు సహా ప్రధానమంత్రి ముఖ్య శాస్త్ర సలహాదారు (పీఎస్‌ఏ) కార్యాలయం ఉంటుంది.

 

సమాచార సాంకేతిక సదుపాయ సంసిద్ధంగా రూపొందిన ఈ సరికొత్త సౌధం సురక్షిత పని ప్రదేశాలు, గుర్తింపు కార్డు ఆధారిత ప్రవేశ-నిష్క్రమణ నియంత్రణ, సమీకృత ఎలక్ట్రానిక్ నిఘా, కేంద్రీకృత కమాండ్ వ్యవస్థ తదితర ఆధునిక పాలన మౌలిక సదుపాయాలకు ఉదాహరణగా నిలుస్తుంది. రెండుపొరల గాజుతో రూపొందించిన ప్రధాన ప్రవేశద్వారాలు, పైకప్పు సౌరవిద్యుదుత్పాదన సౌకర్యం, సోలార్ వాటర్ హీటింగ్, అధునాతన ‘హెచ్‌వీఏసీ’  వ్యవస్థలే కాకుండా వర్షజల సంరక్షణతో ‘గృహ-4’ రేటింగ్‌ లక్ష్యంగా దీన్ని నిర్మించారు. అందువల్ల సుస్థిరత అంశంలోనూ ఈ భవనం విశిష్టమైనది. శూన్య-ద్రవ వ్యర్థ నిర్వహణ, అంతర్గత ఘన వ్యర్థాల శుద్ధి, రీసైకిల్ నిర్మాణ సామగ్రి విస్తృత వినియోగం వగైరాలతో ఇది పర్యావరణ చైతన్యాన్ని పెంచుతుంది.

 

అంతేగాక  కర్తవ్య భవన్ నీటి అవసరాలలో అధికశాతం తీర్చడానికి మురుగునీటి శుద్ధి-పునర్వినియోగం పద్ధతిని అనుసరిస్తారు. ఈ భవనం తాపీ, పేవింగ్ బ్లాక్‌ల పనిలో రీసైకిల్ చేసిన నిర్మాణ-కూల్చివేత వ్యర్థాలను ఉపయోగించారు. ఉపరితల మట్టి వినియోగం, నిర్మాణ భారం తగ్గించేలా కార్యాలయంలో విభాగాలను తేలికైన పొడి గోడలతో రూపొందించారు. దీంతోపాటు అంతర్గత ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ దీని ప్రత్యేకత.

ఇంధన పొదుపు లక్ష్యంగా నిర్మితమైన ఈ భవనం అవసరాలన్నీ తీరడంతోపాటు 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. భవనాన్ని చల్లగా ఉంచడానికి, వెలుపలి శబ్ద నిరోధానికి ప్రత్యేక గాజు కిటికీలు అమర్చారు. ఇంధన పొదుపు ‘ఎల్‌ఈడీ’ దీపాలు, అవసరం లేనప్పుడు వాటిని ఆపివేసే సెన్సర్లు, ఇంధన పొదుపు స్మార్ట్ లిఫ్టులు, విద్యుత్ వినియోగ నిర్వహణ కోసం అత్యాధునిక వ్యవస్థ వగైరాలన్నీ విద్యుత్‌ ఇతోధిక ఆదాకు తోడ్పడతాయి. కర్తవ్య భవన్-03 పైకప్పుపై అమర్చిన సోలార్ ఫలకాలు ఏటా 5.34 లక్షల యూనిట్లకుపైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. సోలార్ వాటర్ హీటర్లు రోజువారీ వేడి నీటి అవసరంలో నాలుగో శాతానికిపైగా తీరుస్తాయి. మరోవైపు ఈ ప్రాంగణంలో విద్యుత్‌ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *