వందేమాతరం కేవలం గీతం కాదు.. అదో స్ఫూర్తి మంత్రం : ప్రధాని మోదీ

వందే మాతరం కేవలం గీతం కాదని, అదో స్ఫూర్తి మంత్రం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయులకు గొంతుక అయ్యిందని, ఎన్నోతరాలకు స్ఫూర్తినిచ్చిన గీతం అని కొనియాడారు. ఇప్పటికీ, ఎప్పటికీ వందేమాతరం భారతీయులకు స్ఫూర్తిమంత్రమేనని స్పష్టం చేశారు. వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై లోకసభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. అలాగే స్వాతంత్ర పోరాటానికి శక్తి, ప్రేరణ, త్యాగ మార్గాన్ని చూపిన మంత్రం, నినాదం అని అన్నారు. ఇది దేశ వ్యాప్తంగా ప్రతి గొంతుకు ధైర్యాన్ని, ఐక్యంతను పెంచిందని, మన అసంఖ్యాక స్వాతంత్ర సమరయోధులు వందేమాతరం అని నినదించి, ఉరిశిక్షను స్వీకరించారన్నారు.

 

ముస్లిం లీగ్ ఒత్తిడితో తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతరం స్ఫూర్తి విషయంలో రాజీ పడి, ఆ తర్వాత భారత విభజనను కూడా అంగీకరించారని దునుమాడారు. ముస్లిం లీగ్ నాయకుడు  జిన్నా 1937 అక్టోబర్ 15న లక్నో నుండి వందేమాతరం పట్ల తన వ్యతిరేకతను మొదట తీవ్రతరం చేశారని, అక్టోబర్ 20న నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు వ్రాసిన లేఖలో జిన్నా భావాలతో ముడిపెట్టి, వందేమాతరం ఆనంద్‌మఠం నేపథ్యం “ముస్లింలను చికాకు పెట్టే” సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారని గుర్తు చేశారు.

 

వందేమాతరంపై మహాత్మా గాంధీ అభిప్రాయాలను కూడా అధిగమించే శక్తులు, ప్రేరణలు ఉన్నాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దక్షిణాఫ్రికా నుండి ప్రచురించే ఇండియన్ ఒపీనియన్ అనే వారపత్రికలో 1905 డిసెంబర్ 2న గాంధీ ఇలా రాశారు అంటూ పేర్కొంటూ.. “బంకించంద్ర స్వరపరిచిన వందేమాతరం పాట బెంగాల్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. స్వదేశీ విప్లవం సమయంలో, బెంగాల్‌లో లక్షలాది మంది గుమిగూడి బంకిమ్ పాటను పాడిన భారీ ర్యాలీలు జరిగాయి. ఈ పాట చాలా ప్రజాదరణ పొందింది, అది మన జాతీయ గీతంగా మారినట్లు అనిపిస్తుంది”. అని ఉటంకించారు.

 

జాతీయ గీతానికి ఎందుకు అన్యాయం జరిగింది? ఏ శక్తి కోరికలు పాటపై మహాత్మా గాంధీ అభిప్రాయాలను అధిగమించాయి? ఏ శక్తులు వందేమాతరంను కూడా వివాదాల్లోకి లాగాయి? వందేమాతరం ద్రోహం చేయడానికి గల కారణాలను ప్రస్తుత తరాలు తెలుసుకోవాలి” అని మోదీ స్పష్టం చేశారు. జిన్నా పాటను వ్యతిరేకించడాన్ని ప్రస్తావిస్తూ, జిన్నా ప్రతిఘటన తర్వాత, “నెహ్రూ తన కుర్చీ వణుకుతున్నట్లు చూశాడు” అని మోదీ దెప్పిపొడిచారు.

modi2

“జిన్నా పాటను వ్యతిరేకించిన ఐదు రోజుల తర్వాత, నెహ్రూ అక్టోబర్ 20న నేతాజీ బోస్‌కు లేఖ రాశారు. జిన్నా భావాలతో అనుబంధిస్తూ, వందేమాతరం ఆనంద్‌మఠం సందర్భం ముస్లింలను చికాకుపెడుతుందని నెహ్రూ చెప్పారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నెహ్రూ బోస్ కు రాసిన లేఖను ఆయన ఉటంకించారు: “నేను వందేమాతరం నేపథ్యాన్ని చదివాను. ఈ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టగలదని నేను భావిస్తున్నాను” అని అందులో తెలిపారు.

దీని తర్వాత, అక్టోబర్ 29న కోల్‌కతాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని, అక్కడ వందేమాతరం వాడకాన్ని సమీక్షిస్తామని కాంగ్రెస్ ఒక ప్రకటన ఇచ్చింది. బంకిం బాబు పాటను సమీక్షించడానికి కాంగ్రెస్ బెంగాల్‌ను ఎంచుకుంది. దేశం దిగ్భ్రాంతి చెందింది. స్వాతంత్ర్య సమరయోధులు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కానీ దేశ దురదృష్టం ఏమిటంటే, అక్టోబర్ 29న కాంగ్రెస్ వందేమాతరంపై రాజీపడి, జాతీయ గీతాన్ని కుదించి, దానిని ముక్కలు చేసి, సామాజిక సామరస్యం పేరుతో దీనిని సమర్థించింది,” అని మోదీ విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ వందేమాతరంపై ముస్లిం లీగ్‌కు లొంగిపోయిందని చరిత్ర సాక్ష్యంగా ఉందని, కాంగ్రెస్ తన సంతృప్తి రాజకీయాలను ఆడిన తీరు ఇదేనని ఆయన మండిపడ్డారు. “సంతృప్తి రాజకీయాల బలవంతం కారణంగా, కాంగ్రెస్ వందేమాతరం విభజనకు లొంగిపోయి అంగీకరించింది. అందుకే ఒక రోజు కాంగ్రెస్ కూడా భారతదేశ విభజనకు వంగి అంగీకరించింది.’’ అని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *