హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని దెబ్బతీయవు : ప్రధాని మోదీ

కెనడాలోని హిందూ ఆలయంపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురిచేసే పిరికిపంద యత్నాలని అన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని దెబ్బతీయవని, బలహీనపరచవని అన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నట్లు తెలిపారు. కెనడాలో భారతీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నామని, భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరని మోదీ తేల్చి చెప్పారు.

కెనడాలో ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రాంప్టన్ లోని హిందూ సభ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. దేవాలయంలోకి ప్రవేశించి మరీ అక్కడి భక్తులపై దాడిచేశారు. ఈ సమయంలో చిన్న పిల్లలు కూడా మందిరంలోనే వున్నారు. అయినా ఖలిస్తానీ ఛాందసులు దాడి చేస్తూనే వున్నారు. ఈ దాడి అత్యంత ఘోరంగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఖలిస్తానీలు దాడి చేసిన విషయాన్ని భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్రశేఖర్ ఆర్య వెల్లడించారు. కెనడా రాజకీయాల్లోనే కాకుండా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల్లోకి కూడా అతివాద ఖలిస్తానీలు చొరబడ్డారన్న విషయాన్ని తాము పదే పదే చెబుతున్నామని, ఇప్పుడు నిజమైందన్నారు. మరోవైపు ఇంత దాడి జరిగినా ప్రధాని ట్రూడో పొడిపొడిగానే స్పందించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.హిందువులు ముందుకు వచ్చి, తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *