కార్య శతాబ్ది కార్యక్రమాలతో సమాజంలో సానుకూల ఆలోచనలు, కార్యచైతన్యం పెరిగింది : కాచం రమేష్
హిందూ సంఘటనం దిశగా వ్యక్తి నిర్మాణం ఆధారంగా స్వయంసేవకులను తీర్చిదిద్దుతూ సమాజపరివర్తన ప్రధానంగా సంఘ కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ అన్నారు. హర్యానాలోని సమాల్ఖాలో మార్చి 13 నుంచి 15 తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి హైదరాబాదులో మీడియా ప్రతినిధులకు వివరించారు. ఆర్ఎస్ఎస్ని స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన తరుణంలో సంఘ భావజాలం, సంఘ్ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న వేళ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయన్నారు. 1925లో సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచీ అనేక రకాల సమస్యలు, అవకాశాల నడుమ సంస్థ వృద్ధి చెందుతూ వచ్చిందన్నారు. మీడియా ప్రతినిధులకు కాచం రమేశ్ తెలిపిన ఇతర అంశాలు…
“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపనకు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గత విజయదశమి శుభావసరాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. వాటితో పాటు శతాబ్ది సంవత్సర కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విభిన్న కార్యక్రమాలలో కార్యకర్తలు విశాలమైన ప్రణాళికతో, కష్టపడి పనిచేయడంతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. సమాజంలోని బంధువులు కూడా హర్షపూర్వకంగా వాటిని స్వాగతించి సహకారం, మద్దతు అందించారు. సంఘ నిర్మాణంలో సమాజంలోని వివిధ వర్గాలు, స్థాయిలకు చెందిన బంధువులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో గొప్ప సహకారం అందించారు. ఈ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించడం ద్వారా సంఘానికి సంస్థాగతంగా ఎంతో లాభం కలిగింది. సమాజంలోని చిన్న చిన్న స్థాయిల వరకు చేరుకోవడంలో మంచి విజయాన్ని సాధించాం. గృహ సంపర్క కార్యక్రమం ద్వారా సంఘం యొక్క ఆలోచనలు దూర ప్రాంతాల వరకు, ఇంటింటికి చేరాయి. సద్భావ సమావేశాలు,పౌర సమావేశాల ద్వారా సమాజంలో సానుకూల ఆలోచనలు, కార్యచైతన్యం పెరిగింది. సంఘం చేస్తున్న పనిని ప్రజలు సమగ్రంగా అర్థం చేసుకుంటూ దేశ జీవితంలో సంఘం నుండి మరింత సేవలను ఆశిస్తున్నారు. “పంచ పరివర్తన” వంటి అంశాలకు కూడా విస్తృత స్వాగతం లభించింది. సంఘ్ గురించి తెలుసుకోవాలని, సంఘ్లో చేరాలనే ఆసక్తి ప్రజలలో పెరుగుతోంది. సంఘ్ చేపట్టే సామాజిక కార్యాలపై దృష్టి సారించారు.
2025–26 సంవత్సరం శతాబ్ది సంవత్సరం కావడంతో శతాబ్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పర్యటనల ప్రణాళిక రూపొందించబడింది. మొత్తం 22 ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారి పర్యటనలు జరిగాయి. సామాజిక సద్భావ సమావేశాలు, ప్రముఖ పౌరులతో సమావేశాలు, హిందూ సమ్మేళనాలు, సమాజంలో ప్రభావవంతులైన వ్యక్తులతో సంభాషణలు వంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాలలో నిర్వహించబడ్డాయి. కొన్ని ప్రాంతాలలో యువ పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు మరియు జనజాతి బంధువులతో ప్రత్యేక సంభాషణ కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. సంఘం 100 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రజల ముందుంచి వారి సందేహాలకు సమాధానం ఇచ్చి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని నాలుగు మహానగరాలు – ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబైలో “సంఘం 100 సంవత్సరాలు – కొత్త దిశలు” అనే అంశంపై ఉపన్యాస శ్రేణులు నిర్వహించబడ్డాయి. సమాజంలోని ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు. వివిధ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మొత్తం 55 దేశాలకు చెందిన విద్యా, పరిపాలన, పరిశ్రమ మరియు సామాజిక రంగాల ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
గృహ సంపర్క కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్ భాగవత్ ఢిల్లీలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆమె నివాసంలో కలుసుకొని సంఘ కార్యకలాపాలపై చర్చ జరిగింది. ఇతర ప్రముఖులతో కూడా సమావేశాలు జరిగాయి. అండమాన్, రాయపూర్, సోనేపూర్ మరియు దేవగిరి ప్రాంతాలలో నిర్వహించిన హిందూ సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో పఠాన్కోట్ మరియు అంబాలాలో స్వయంసేవకుల ఏకీకరణ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధ్యాత్మిక, ధార్మిక రంగాల ప్రముఖులతో సమావేశమై వారి ఆశీర్వాదాలు పొందారు. ముని మహాశ్రమణ్ జీ, ముని రత్నసుందర్ జీ, పూరీ పీఠ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి జీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన శ్రీ శ్రీ రవిశంకర్ జీ, రామదేవ్ మిషన్కు చెందిన దాజీ పటేల్ జీ, యోగి భావనాథ్ జీ, ప్రసిద్ధ కథాకారుడు రమేశ్ భాయ్ ఓజా జీ, జగద్గురు వివేకానంద సరస్వతి జీ వంటి ప్రముఖులను కలుసుకొని వారి ఆశీర్వాదాలు పొందారు.” అని కాచం రమేశ్ తెలియజేశారు.
సంఘ్ 1925లో ప్రారంభమైనప్పటి నుంచీ అనేక రకాల సవాళ్ళు, అవకాశాల నడుమ సంస్థ వృద్ధి చెందుతూ వచ్చిందని తెలియజేస్తూ అందుకు సంబంధించిన వివరాలు అందించారు. వాటి ప్రకారం…
దేశవ్యాప్తంగా మొత్తం 55,683 స్థలాల్లో RSS దైనందిన శాఖలు 88,949 నడుస్తున్నాయి. గడచిన ఐదారేళ్ళుగా శాఖలు, పాల్గొంటున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోంది. వీటితో పాటు 32,606 శాఖా మిలన్లు (వీక్లీ), 13,211 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయని, మొత్తంగా దైనందిన శాఖలు, మిలన్లు, మండలితో కలిపి 1,90,449 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో మొత్తం 2,112 స్థలాలలో 3,492 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 375 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని, వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 337, నెలవారీగా 69 శాఖలు జరుగుతున్నాయి.
అఖిలభారత స్థాయిలో కార్యస్థితి (2026):
మొత్తం మండలాలు: 59,004
శాఖాయుక్త: 32,305
పూర్ణ: 2,620
తెలంగాణ:
మండలాలు: 1,616
శాఖాయుక్త: 1,329
బస్తీలు: 1504
శాఖాయుక్త: 1244
ప్రస్తుతం సేవ
అఖిల భారతీయ స్థాయిలో..
సేవా కార్యక్రమాలు 96045
తెలంగాణ ప్రాంతంలో సేవ
773 స్థలాల్లో 1823 కార్యక్రమాలు
హిందూ సమ్మేళనాలు (తెలంగాణలో త్వరలో ప్రారంభమవుతాయి)
37/46 ప్రాంతాల సమాహారం
స్థలాలు
గ్రామాలు 23,143
బస్తీలు 13,905
పాల్గొన్నవారు:
మాతలు 1,55,95,124
పురుషులు 1,93,40,087
———————-
మొత్తం 3,49,35,211
———————-
ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమాలు: 46
పురుషులు 7,814
మాతలు 557
మొత్తం 8,371
సంఘ శతాబ్ది – విజయదశమి
అఖిలభారత:
ఉత్సవాలు 62,555
తరుణ 27,08,186
బాల 5,36,955
———————–
మొత్తం 32,45,141
———————–
గణవేష 25,45,818
తెలంగాణ:
ఉత్సవాలు 4,507
తరుణ 2,00,532
బాల 53,748
———————-
మొత్తం 2,54,280
———————-
మహిళలు 39,611
గణవేష 78,184
జనసంపర్క అభియాన్
37/46 ప్రాంతాల సమాహారం
అఖిలభారత:
గ్రామాలు: 3,89,465
బస్తీలు: 31,143
ఇళ్ళు: 10,02,12,162
కరపత్రాలు: 9,11,88,203
పుస్తకాలు: 84, 13,552
తెలంగాణ:
గ్రామాలు: 8,126
బస్తీలు: 1,504
ఇళ్ళు: 24,98,347
కరపత్రాలు: 29,00,000
పుస్తకాలు: 1,30,000
విశేష వ్యక్తులు: 3,560
జట్లు: 10,771