నారీశక్తికి ప్రతీక రాణి దుర్గావతి
బలిదానమై 500 సంవత్సరాలు పూర్తి
ఇది సుమారు 500 సంవత్సరాలల నాటి చరిత్ర. అవి దసరా నవరాత్రుల రోజులు. ఆ రోజు దుర్గాష్టమి. మహారాణి కమలాదేవి ప్రసవ వేదన పడుతున్నది. ఆమె భర్త కీర్తి దేవసింహుడు కాలింజర్ కోట సమీపంలో వున్న దుర్గామందిరంలో పూజ చేయించి తిరిగి వస్తున్నారు. అంతటా ఉత్సుకత నెలకొని వుంది. భావి సామ్రాజ్యాధినేత ఎవరు అవుతారో కమలాదేవి ప్రసవిస్తే తెలుస్తుంది. రాజు జ్యోతిష్యులతో మంతనాలు జరిపాడు. ఇంతలో ఎవరో పరుగెత్తుకొచ్చారు. ‘మహారాజ జయం! మహారాణి ఒక సుందరమైన పుత్రికకు జన్మనిచ్చింది’ అని రాజు చెవినవేశారు. మహారాజు ప్రథమ సంతానం ఆనంద పడ్డాడు.
అక్కడ కూర్చున్న జ్యోతిష పండితులు, తిధి, వార, నక్షత్రముల వివరాలు తీసుకొని గుణిస్తూ, గణిస్తూ, ‘మీ ఈ పుత్రిక గొప్ప తోజోవంతమైన, ప్రజాపాలకురాలై అత్యంత గౌరవం పొందుతుందని చెప్పారు. ఆమె కీర్తి ప్రపంచ వ్యాప్తం అవుతుంద న్నారు. ఆమె దాంపత్య జీవనం మాత్రం ఎక్కువ కాలం నిలవదు. కాని శ్రేష్ఠమైనది. ఆమె వ్యక్తిగత జీవనం సుఖ దుఃఖాల మయమౌతుంది’ అన్నారు. రాజు జ్యోతిష్య పండితులకు దానాలిచ్చి పంచించి వేశాడు. ఆమె భవిష్యవాణి విని కొంచెం బాధపడ్డాడు. అయినా సంతోషించాడు. క్రీశ 1524 అక్టోబరు 5, దుర్గాష్టమి నాడు ఆమె పుట్టింది. ఉత్తర ప్రదేశ్లోని బాండ జిల్లాలో కాలింజర్ కోట అది. దుర్గాష్టమి నాడు పుట్టింది కనుక దుర్గావతి అని నామకరణం చేశారు. ఆమె అందమైన, శీలవంతురాలైన, యోగ్యమైన మరియు సాహసోపేత మైన పుత్రిక. ఆమె పూర్వజూలు కూడా గొప్ప యుద్ధ వీరులు. చిన్న తనంలోనే ఆమె అస్త్ర శస్త్రాలను అభ్యసించడం మొదలయింది. కత్తి తిప్పడంలో సిద్ధ హస్తురాలైంది.
రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి వున్న గౌరవం గుర్తుకువస్తుంది. స్వధర్మం కోసం, దేశం కోసం, మాతృ భూమి గౌరవం నిలబట్టేం దుకు, పేరులోనే కాదు చేతల్లోనూ దుర్గామాత అవతారం ఎత్తిన రణచండి ఆమె. రూపంలో, గుణంలో, ధన వైభవంలో ఆమెకు ఆమె సాటి. వీర పురుషులు భరత చరితలో వున్నట్టే. వీరాంగనలు కూడా భరత చరిత్రను సాహసో పేతంగా మలిచారు. నిపుణత కల్గిన యోధురాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ, రాణి అవంతి బాయి, అహల్యా బాయి హోల్కర్ సరసన రాణి దుర్గావతి చేరిపోయారు.
ఆమె వనవాసుల్లో గోండు తెగకు చెందిన స్త్రీ. గోండు రాణిగా ప్రసిద్ధి కెక్కింది. జీవితంలో ఎపుడూ పరాజయం చూడని ధీరవనిత. మాతృభూమి రక్షణ కోసం అంతిమ క్షణం వరకు పోరాడిరది. మొగలులతో పోరాటంలో ఆమె అగ్రేసరురాలిగా నిలిచింది. ఆమె బహుముఖ వ్యక్తిత్వం కలది. తన రాజ్యంలో ప్రజలకు ఆమె తల్లిలా, పరిపాలనలో చక్కటి శాసకురాలిగా, శత్రువుల పాలిట సింహా స్వప్నంలా ఆమె భాసించింది. మొగలుల పరిపాలనలో స్వాభిమానంతో జీవించడం నేరంగా వుండేది. నాడు అక్బరుకు అందరు హిందురాజులు దాసోహమన్నారు. వైధవ్యంతో ఓ రాణి చక్కటి పరిపాలన చేయడం అక్బరుకు కంటిగింపైంది. తనను శరణువేడమన్నాడు. ససేమిరా అంది. యుద్ధంలో 3 సార్లు ఓడిపోయాడు అక్బరు. జీవిత కాలంలో ఆమె 52 యుద్ధాలు చేసింది. 51 యుద్ధాల్లో గెలిచింది. ఆమె సబల. ముస్లింల కూట యుద్ధనీతి కారణంగా ఆమె ఓడిరది. శత్రువు చేతిలో తన శరీరం పడకూడదని తనకు తానుగా ఆత్మాహుతి చేసుకుంది.
ఆమె సందేశం మేరకు అక్బరుకు వశం కాకుండా 5000 మంది గోండు మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు. నారీవాహిని నిర్మాణం చేసింది. అక్బరు తరువాత యుద్ధంలో గెలిచివుండవచ్చు. కాని పరాక్రమం చూపి స్వాభిమాన సందేశం యిచ్చి జయకేతనం ఎగుర వేసింది మాత్రం రాణి దుర్గావతి ఆమె గోండు రాణిగా కాక దేశానికే రాణి అయింది.
గోండు జాతి హిందూ సమాజంలో అంతర్భాగం అని ప్రకటించింది. ఆమె గౌరవగాథ జనజీవనానికి ప్రేరణనిచ్చింది. జబల్పూర్లోని దుర్గావతి పరిశోధన సంస్థ ఆమె బలిదాన స్థలం నుంచి జన్మస్థలం వరకు అనేక పురావస్తు శిధిలాలను, ఆధారాలను సేకరించి భద్రపరచింది. జబల్పూర్ విశ్వ విద్యాలయం పేరును రాణి దుర్గావతి విశ్వ విద్యాలయంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నామాంతరం చేసింది. 1988లో కేంద్ర ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారక తపాల బిళ్ళను విడుదల చేసింది.