జాతి పునర్నిర్మాణంలో నూరు వసంతాలు…

దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలురాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఫ్‌ు స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం.  సంఘ్ స్థాపకులైన డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ వారి జయంతి రోజైన ఈ సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం సమరసతతో కూడిన సమైక్య భారతావని భవిష్యత్తు దిశగా సంకల్పం చేసుకునేం దుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది?

సమాజానికి చికిత్స

డాక్టర్‌ హెడ్గేవార్‌ పుట్టుకతోనే దేశభక్తి గలవారు, భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే వారిలో కనపడిరది. కోల్‌కతలో తన వైద్య విద్యను పూర్తిచేసే నాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్‌ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో, భారతీయ సమాజంలోని వైద్యుడిగా, ఆయన మనం స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి గల ప్రాథమిక సమస్యలను విశ్లేషించి, ఇందుకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణా రాహిత్యం వల్ల భారత దేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు.

ఎడతెగని ఈ దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభవానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధ మైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నాలతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని ఆయన నిర్ణయించారు. ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన, ప్రత్యేకమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.

వ్యక్తినిర్మాణం

రాజకీయ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ, ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్స హించిన డాక్టర్‌ హెడ్గేవార్‌, మొత్తం సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ శిక్షణా విధానాన్ని అభివృద్ధి చేశారు తప్ప, సమాజంలో ఒక సంస్థను ఏర్పరచడం కోసం కాదు. నేడు, అంటే నూరేళ్ళ తరువాత కూడా వేలాదిగా యువతరం డాక్టర్‌ హెడ్గేవార్‌ చూపిన మార్గాన్ని అనుసరించి, దేశం కోసం అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజంలో సంఫ్‌ు పట్ల స్వీకారభావం, ఆకాంక్షలు పెరుగుతున్నాయి. ఇవన్నీ డాక్టర్‌ జీ దృష్టికోణం, విధానాలకు అంగీకార సంకేతాలు మాత్రమే.

హిందుత్వ కార్యప్రణాళిక

ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్దమైన పురోగతి నిజంగా ఒక అద్భుతానికి ఎంతమాత్రం తక్కువ కాదు. భారతదేశంలోని ఎక్కువ భాగం ఉన్నతవర్గ ఇంగ్లీష్‌ విద్యార్థులపై సంకుచితత్వ, వేర్పాటువాద, ప్రాంతవాదంతో కూడిన ఐరోపా జాతీయభావ ప్రభావం ఉన్నప్పుడు వీరికి హిందుత్వం, జాతీయభావనను వివరించడం సులభం కాదు. డాక్టర్‌ హెడ్గేవార్‌ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు,

నిర్మాణం కోసమే నిర్వహణ

 ‘‘నిర్మాణం కోసమే నిర్వహణ’’ అనే సూత్రం, దేశజీవితంలో వివిధ రంగాలలో నిర్వహణాశీల శక్తిని ప్రసారం చేసేలా విస్తరించింది. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్‌ అనే భావన విద్య, కార్మిక, రాజకీయ రంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది.

ఏ రకమైన వివక్షకైనా ధార్మిక అనుమతి ఉండదని భారతదేశంలోని మతశాఖలన్నీ ప్రకటించడంతో హిందూ సమాజపు సంస్కరణ  కొత్త వేగాన్ని అందుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఫ్‌ు స్వయంసేవకులు కీలకపాత్ర పోషించారు. ఈ తొంభైతొమ్మిదేళ్ళ కాలంలో శాఖ అనే భావన నుంచి సంఫ్‌ు విస్తరించి, సమాజపు ధర్మశక్తి ఆధారంగా సేవా కార్యకలాపాలలో నిమగ్నమై గణనీయమైన అడుగులు వేసింది. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభివృద్ధి వరకు, జాతీయ జీవనంలో సంఫ్‌ు స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు.

సాంస్కృతిక జాగృతి

ప్రతి విషయాన్ని రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. లోకమాత అహల్యాబాయి హోల్కార్‌ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఫ్‌ు పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

పెరుగుతున్న శాఖలు

 రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్‌ పరివర్తన్‌ అనే ఐదు అంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ వ్యవస్థను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యావరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన మార్పుపై దృష్టిని ఉంచింది.

సుదీర్ఘ ప్రయాణం

గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా, నిర్లక్ష్యం, పరిహాసంతో ప్రారంభించి జిజ్ఞాస, ఆంగీకారం వరకు ప్రయాణించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారాలను అందించే సామర్థ్యం భారతదేశపు ప్రాచీన జ్ఞానంలో ఉంది. కాబట్టి భారతమాత పుత్రులందరు తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తన వంతు కృషి చేయాలని సంకల్పించాలి.

– దత్తాత్రేయ  సబళే, సర్‌ కార్యవాహ, ఆరెస్సెస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *