దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్ మెంట్ పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా 2 వేల కోట్ల నిధులను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా కేటాయింపులతో ఆర్జీఎం, ఎన్ పీడీడీ పథకాలకు అందుబాటులోకి వచ్చే నిధుల మొత్తం 6,190 కోట్లకు పెరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కి తాజాగా మరో వెయ్యి కోట్లు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. దీంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమానికి 15 వ ఆర్థిక సంఘం కాలంలో వెచ్చించే మొత్తం 3,400 కోట్లకు చేరింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్ మెంట్ కార్యక్రమానికి కూడా అదనంగా 1,000 కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించడంతో 15 వ ఆర్థిక సంఘం కాలంలో వెచ్చించే మొత్తం 2,790 కోట్లకు చేరింది.
పాల సేకరణ, సేకరించిన పాల శుద్ధికి అవసరమైన మౌలిక వసతుల ఆధునికీకరణతో పాటు నాణ్యమైన పాడిపశువుల సంతతి వృద్ధికి ఈ నిధులను వెచ్చించనున్నారు. దీంతో రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
కొత్తగా చేరిన రెండు కార్యకలాపాలు:
1. మొత్తం 15000 ఆవులను కలిగి ఉన్న 30 గృహ సౌకర్యాలను సృష్టించడానికి అమలు చేసే ఏజెన్సీలకు ఆవుల పెంపక కేంద్రాల స్థాపనకు మూలధన వ్యయంలో 35% ఒకేసారి సహాయం, 2. అధిక జన్యు యోగ్యత (HGM) IVF ఆవులను కొనుగోలు చేయడానికి రైతులను ప్రోత్సహించడం, అటువంటి కొనుగోలు కోసం రైతు పాల సంఘాలు / ఆర్థిక సంస్థలు / బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంపై 3% వడ్డీ రాయితీని అందించడం. ఇది అధిక దిగుబడినిచ్చే జాతుల క్రమబద్ధమైన ప్రేరణకు సహాయపడుతుంది.
కొత్తగా చేరిన రెండు కార్యకలాపాలు: (i) మొత్తం 15000 ఆవులను కలిగి ఉన్న 30 గృహ సౌకర్యాలను సృష్టించడానికి అమలు చేసే ఏజెన్సీలకు ఆవుల పెంపక కేంద్రాల స్థాపనకు మూలధన వ్యయంలో 35% ఒకేసారి సహాయం, (ii) అధిక జన్యు యోగ్యత (HGM) IVF ఆవులను కొనుగోలు చేయడానికి రైతులను ప్రోత్సహించడం, అటువంటి కొనుగోలు కోసం రైతు పాల సంఘాలు / ఆర్థిక సంస్థలు / బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంపై 3% వడ్డీ రాయితీని అందించడం. ఇది అధిక దిగుబడినిచ్చే జాతుల క్రమబద్ధమైన ప్రేరణకు సహాయపడుతుంది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ మరియు ప్రభుత్వం ఇతర ప్రయత్నాల అమలుతో గత దశాబ్దంలో పాల ఉత్పత్తి 63.55 శాతం పెరిగింది. 2013-2014 లో రోజుకు 307 గ్రాములుగా వున్న పాల లభ్యత 2023-2024 లో రోజుకు 471 గ్రాములకు పెరిగింది. గత పదేళ్లలో ఉత్పాదకత కూడా 26.34 శాతం మెరుగుపడింది.