యువరాజు – జైలు శిక్ష

1924లో బ్రిటన్‌ యువరాజు వేల్స్‌ భారతదేశ పర్యటన ఖరారైంది. తమ యువరాజును భారతీయులు గౌరవించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది.

భారతీయులకు ధర్మాచార్యులు, సాధుసంతుల పట్ల నిష్ట ఉంటుంది కాబట్టి ఆ నిష్టను ఉపయోగించుకోవాలనుకుంది. పూరీశంకరా చార్యులైన స్వామీ భారతీకృష్ణతీర్థులకు ఒక ఉత్తరం వ్రాసింది. రాజును శ్రీమహావిష్ణువు అంశగా భావించే హిందువులకు వేల్స్‌ యువరాజును కూడా అలాగే భావించి గౌరవించాలని బోధించమని కోరింది.

ఈ ఉత్తరానికి సమాధానంగా స్వామీజీ తిరిగి ఉత్తరం వ్రాశారు. ‘ఆంగ్లేయులు విదేశీ దోపిడీదారులు. వాళ్ళు ప్రజాపాలకులు కారు. కపటంతో మా మాతృభూమిని ఆక్రమించి మమ్మల్ని బానిసల్ని చేశారు. అలాంటి వాళ్ళును విష్ణువు ప్రతినిధిగా ఎలా ప్రకటించగలను?’ అంటూ అందులో వ్రాశారు.

స్వామీజీ వ్రాసిన ఈ సమాధానం బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఆయనపై రాజద్రోహనేరం మోపి జైలులో బంధించింది. అయినా భారతీకృష్ణతీర్థులు తమ దేశభక్తిని మాత్రం వదులుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *