కర్నూలు నగరంలో శౌర్యదివాస్ ర్యాలీ…

గీతా జయంతి సందర్భంగా కర్నూలు లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య దివాస్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ ని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి ప్రారంభించారు. నగరంలోని వివేకానంద సంస్కృత పాఠశాల నుంచి వినాయక ఘట్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ కొనసాగింది. ఈసందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ దేవాలయాలను రక్షించుకొని హిందూ సంస్కృతి ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం లో హిందులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *