సమాచార భారతి ఆధ్వర్యంలో ‘‘సోషల్‌ మీడియా సంగమం’’

సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కేశవ మెమోరియల్‌ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్‌ పటేల్‌హాల్‌లో సోషల్‌ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్‌ రెడ్డి గారు స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఈ సోషల్‌ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగు తోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై శ్రీ జి.ఎన్‌. రావుగారు, శ్రీమతి కాశీనాథుని శిరీష గారు విలువైన విషయాలు తెలియజేశారు. ప్రాధాన్యత రంగాల్లో ఆత్మ నిర్భరత ఆవశ్యకతని శ్రీ జి. ఎన్‌. రావుగారు వివరిస్తూ .. భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో పరిశోధన చేసిన శ్రీమతి కాశీనాథుని శిరీష గారు మాట్లాడుతూ సోషల్‌ మీడియాను అవసరమైన అంశాలలో ఎలా ఉపయోగించుకోవాలో, అనవసర మైన సమాచారాన్ని ఎలా నిరసించాలో వివరిం చారు. నారేటివ్‌ సదస్సులో దేవగిరి ప్రాంతంలోని బంజారా కుంభమేళా నిర్వహణ ఏ విధంగా బంజారాలను ఐక్యం చేసిందో భారతీయ ధార్మిక మూలాలను ఎలా కలిపిందో కల్పేష్‌ గారు వివరించారు. పాంచజన్య పత్రిక సంపాదకులు హితేష్‌ గారు మాట్లాడుతూ.. వార్తా కథనాలతో అనేక కోణాల గురించి వివరించారు. తప్పుడు వార్తలను ఎలా ఎదుర్కోవాలో, సరైన వార్తలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు.

మూడవ సదస్సులో శ్రీ రాజగోపాల్‌ గారు సమాచార భారతి యొక్క వార్త విభాగాలైన ఙంస్‌వశ్రీaఅస్త్రaఅa.శీతీస్త్ర, నిజం మొదలైన ఇన్ఫర్మేషన్‌ బేస్‌ గురించి వివరించారు. ముగింపు సమావేశంలో మాట్లాడిన క్షేత్ర ప్రచార ప్రముఖ్‌ శ్రీ ఆయుష్‌ గారు.. సమాజం ముఖ్యమైన సంస్కృతి స్వరూపమనీ, ప్రపంచం యావత్తు భారతదేశ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని గౌరవించిందని, విశ్వ వ్యాప్తమైన ఆలోచనకు భారతీయ జ్ఞానధార తగిన బలాన్ని అందిస్తోందని కనుక విషయాన్నీ గమనించి సోషల్‌ మీడియాలో తగిన జాగ్రత్తలో ఉండాలని కోరారు. దాదాపు 200 మందికి పైగా యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తగిన దిశానిర్దేశం పొందారు. ఈ సదస్సును ప్రదీప్‌, అమర్నాథ్‌ రెడ్డి గారు, సురేందర్‌ గారు నిర్వహిం చారు. శ్రీ రమేష్‌ గారు వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *