భారత మాత విగ్రహాన్ని అపవిత్రం చేసిన సున్నీ యువకులు
తిరువనంతపురంలో సున్నీ విద్యార్థులు భారత మాత విగ్రహాన్ని అపవిత్రం చేశారు. తిరువనంతపురం జిల్లా అమబలతర పారుతిక్కుజీ లో సంఘ్ నుంచి ప్రేరణ పొందిన హిందూ ఐక్యవేదిక ఈ భారత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దుండగులు అంతా ముస్లిం మత కేంద్రం నుంచే వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. భరతమాత విగ్రహాన్ని అపవిత్రం చేయడంపై ఆరెస్సెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘ్ కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం మత కేంద్రం నుంచి బిర్యానీ ప్యాకెట్లతో బయటికి వచ్చిన సున్నీలు కత్తులతో అపవిత్రం ధ్వంసం చేశారు. ఇది మొత్తం సీసీ టీవీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఘటనపై హిందూ ఐక్యవేదిక బాధ్యులు స్పందించారు. దిగజారిపోయి సున్నీలు ఇలా చేశారని మండిపడ్డారు. కుళ్లిపోయిన సంస్కృతితో పెరిగే పిల్లల వల్ల ఈ దేశానికి ముప్పు పొంచి వుందన్నారు. భారత మాత చిత్రాన్ని అపవిత్రం చేయడం దిగ్భ్రాంతికరమైన విషయమని పేర్కొన్నారు. ఈ విషయంలో సున్నీ విద్యార్థులను అని లాభం లేదని, ఇలాంటి దుశ్చర్యలకు దారితీసిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మత బోధనల ద్వారా తలెత్తే పరిస్థితులను లోతుగా చర్చించాల్సిన సమయం మాత్రం ఆసన్నమైందని హిందూ ఐక్య వేదిక కేపీ శశికళ అన్నారు.అసలు యువకులను ఎవరు పంపారో వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.