కరీంనగర్ వేదికగా ‘‘స్వదేశీ మేళా’’ ప్రారంభం
స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో స్వదేశీ మేళా కార్యక్రమం ప్రారంభమైంది. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మేళాను కరీంనగర్ ఎస్పీ సుంకర శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సుంకర శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో RSS పూర్వ ప్రాంత సంఘ చాలక్ దక్షిణా మూర్తి , స్వదేశీ జాగరణ మంచ్ క్షేత్ర సంఘటక్ జగదీష్ , ప్రాంత కన్వీనర్ ముక్క హరీష్ బాబు , స్వావలంబి భారత్ అభియాన్ ప్రాంత కో కన్వీనర్ ఇంద్రసేన్ రెడ్డి , మేళా కో కన్వీనర్లు గంప వెంకట్ , వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ మేళాతో స్థానిక కళాకారులు, ఉత్పత్తులు, వ్యాపారులను ప్రోత్సహించడం అభినందనీయమని వక్తలు అన్నారు. స్వదేశీ అనేది స్వయంసమృద్ధితో పాటు దేశ ఆత్మనిర్భరతను అన్ని రంగాల్లో అద్భుతంగా సహకరించేలా తారకమంత్రంగా అభివర్ణించారు. మేళాలో భాగంగా పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యాలకు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. చదువుతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లోనూ రాణించాలన్నారు.
స్వదేశీ మేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి స్వదేశీ ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక స్వదేశీ స్థానిక ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం జరిగింది.