పొదుపు సంఘాల మహిళలకి ఆర్థిక స్వావలంబన.. ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వాలని నిర్ణయం

పొదుపు సంఘాల మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారిని మరింత పరిపుష్టం చేయాలని నిర్ణయించింది. అందుకోసం మరో ప్రత్యేక స్కీమ్ ను ముందుకు తెచ్చింది సర్కార్. తక్కువ ఖర్చుతో పర్యావరణరహిత ఎలక్ట్రిక్ ఆటోలను ఆ మహిళలకు ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే… ఇందుకోసం ప్రాథమికంగా జనగామ జిల్లాను ఎంపిక చేసుకుంది. ఇందుకు అనుగుణంగా జనగామ జిల్లాలోని పాలకుర్తిలో ఓ మహిళకి అధికారులు ఎలక్ట్రిక్ ఆటోను అందజేశారు.

 

 

పొదుపు సంఘంలో వున్న సభ్యురాలు లేదా వారి కుటుంబంలో లైసెన్స్ వున్న వ్యక్తికి ఈ వాహనాన్ని ఇస్తారు. స్త్రీనిధి రుణం నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి వుంటుంది. స్త్రీనిధి నుంచి రుణం రూపేణా అందించి ప్రతి నెలా వడ్డీతో సహా చెల్లించాలి. ఈ ఆటోలను పాలకుర్తి సోమేశ్వరాలయం, సోమనాధుని స్మృతివనం, వల్మిడి రామాలయం, బమ్మెర పోతన జన్మస్థలం, పంచగుళ్లు తదితర ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులో వుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *