పాకిస్తానీలు వెంటనే వెళ్లిపోవాలి : తెలంగాణ డీజీపీ అల్టిమేటం

తెలంగాణలో వున్న పాక్ పౌరులకు తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో వున్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వీసాలు 27 వ తేదీ తర్వాత పనిచేయవన్నారు. మెడికల్ వీసాల మీద వున్న వారికి ఏప్రిల్ 29వరకు మాత్రమే గడువు వుందని, లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదన్నారు. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుంచి వెళ్లవచ్చని, ఈ నెల 30 వరకు అటారీ బార్డర్ తెరుచుకొని వుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాల్సిందేనని, ఒకవేళ అక్రమంగా తెలంగాణలో వుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *