బంగ్లాదేశ్ హిందువులకు సంఫీుభావం
బంగ్లాదేశ్ హిందూ సమాజానికి సంఫీు భావంగా నిలబడాలని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ తీర్మానం
బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర మైనారిటీలు ఎదుర్కొంటున్న అదుపులేని, ప్రణాళికాబద్ధమైన హింస, అన్యాయం, అణచివేత పట్ల ABPS తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశమన్నది సుస్పష్టం.
బంగ్లాదేశ్లో ఇటీవల చోటుచేసుకున్న అధికార మార్పు సమయంలో, మఠాలు, ఆలయాలు, దుర్గాపూజ మండపాలు, విద్యా సంస్థలపై దాడులు, దేవతా విగ్రహాల అపవిత్రీకరణ, క్రూర హత్యలు, ఆస్తుల దోపిడీ, మహిళల అపహరణ, లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి వార్తలు నిరంతరం బయటకు వస్తున్నాయి. ఈ సంఘటనలు కేవలం రాజకీయపరమైనవని అంటూ వీటిలోని మతపరమైన కోణాన్ని తోసిపుచ్చడమనేది సత్యాన్ని తిరస్కరించడమే, ఎందుకంటే ఈ ఘటనలతో ముడిపడిన బాధితులలో అత్యధికులు హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.
బంగ్లాదేశ్లోని మతోన్మాద ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలవారు, మరీ ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై జరుగుతున్న హింస కొత్తదేమీ కాదు. బంగ్లాదేశ్లో హిందూ జనాభా నిరంతరం క్షీణించడం (1951లో 22% నుండి నేడు 7.95% వరకు) అనేది హిందువులు ఉన్న సంక్షోభాన్ని సూచిస్తున్నది. అయితే, గతేడాది సంభవించిన హింసాకాండ, విద్వేషపూరిత సంఘటనలకు ప్రభుత్వం, సంస్థాగత మద్దతు లభించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనితో పాటు, బంగ్లాదేశ్లో నిరంతరం వినిపిస్తున్న భారత వ్యతిరేక గళం ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
భారతదేశం చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతంలో అస్థిరతను రేకెత్తించి, ఒక దేశం పట్ల మరొక దేశానికి అవిశ్వాసం కలిగేలా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు పలు అంతర్జాతీయ శక్తులు కలసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంబంధాలపై పనిచేస్తున్న ఆలోచనా పరులు, పండితులు భారత వ్యతిరేక వాతావరణం, పాకిస్తాన్ కార్యకలాపాలు, డీప్ స్టేట్ వ్యవహారాలపై నిఘా ఉంచి వాటిని బట్టబయలు చేయాలని Aదీూూ పిలుపునిస్తోంది. ఈ ప్రాంతమంతా ఉమ్మడి సంస్కృతి, చరిత్ర, సామాజిక బంధాలను కలిగి ఉన్నందువల్ల ఒక ప్రదేశంలో ఏదైనా అలజడి తలెత్తితే, అది ఈ మొత్తం ప్రాంతంలో ఆందోళనకు కారణమవుతుందని Aదీూూ నొక్కి చెప్పాలను కుంటున్నది. భారతదేశం, పొరుగు దేశాల ఈ ఉమ్మడి వారసత్వాన్ని బలోపేతం చేయడానికి సావధానులైన పౌరులందరూ ప్రయత్నాలు చేయాలని Aదీూూ భావిస్తోంది.
ఈ కాలమంతటిలోనూ గమనించదగినది ఏమిటంటే, బంగ్లాదేశ్ హిందూ సమాజం ఈ ఘోరాలను శాంతియుతంగా, సమష్టిగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ధైర్యంగా ప్రతిఘటించింది. అలాగే, ఈ సంకల్పానికి భారతదేశంలోని హిందూ సమాజం నుండి, ప్రపంచవ్యాప్తంగాను నైతిక, మానసిక మద్దతు లభించడం ఎంతో ప్రశంసనీయం. భారతదేశంతో పాటు పలు దేశాలలోని ఆయా హిందూ సంస్థలు ఈ హింసపై తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్లోని హిందువుల భద్రత, గౌరవం కోసం ప్రదర్శనలు, వినతి పత్రాల ద్వారా డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయి నాయకులు అనేకమంది ఈ సమస్యను వారి స్థాయిలో లేవనెత్తారు.
బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలవారికి తోడుగా నిలిచి, వారికి రక్షణ కల్పించా లని భారత ప్రభుత్వం తన సంకల్పాన్ని వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో పాటుగా అనేక ప్రపంచ వేదికలపై ఈ సమస్యను భారత ప్రభుత్వం లేవనెత్తింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో నిరంతర అర్థవంతమైన చర్చలలో పాల్గొని బంగ్లాదేశ్లోని హిందూ సమాజానికి రక్షణ, గౌరవం, శ్రేయస్సు దక్కేలా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేయాలని భారత ప్రభుత్వాన్ని ABPS కోరుతున్నది.
బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల పట్ల కొనసాగుతున్న అమానుష వైఖరిని ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించి, ఈ హింసాత్మక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ABPS అభిప్రాయపడుతోంది. బంగ్లాదేశ్లోని హిందు వులు, ఇతర మైనారిటీ వర్గాలకు సంఫీుభావంగా తమ గళం విప్పాలని వివిధ దేశాలలోని హిందూ వర్గాలకు, నాయకులకు, అంతర్జాతీయ సంస్థలకు ABPS పిలుపునిస్తోంది.