మళ్లీ రైల్ ప్రమాదానికి కుట్రలు… తృటిలో తప్పిన ముప్పు
దేశంలో రైల్వే వ్యవస్థను, ప్రయాణికుల సెక్యూరిటీని ప్రమాదంలో పడేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఈ ప్రయత్నాలను రైల్వే వ్యవస్థ ఎప్పటికప్పుడు తుత్తునీయలు చేస్తూనే వుంది. ఈ మధ్య రైల్వే ట్రాక్ లపై రకరకాల వస్తువులు పెడుతూ… రైల్ ప్రమాదాలకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి బయటపడింద. కానీ.. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్ లోని బిలాస్ పూర్- రుద్రాపూర్ సిటీ మధ్య నడిచే గుజరాత్ మెయిల్ ఎక్స్ ప్రెస్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్లాన్ చేశారు. పట్టాలపై ఆరడుగుల ఐరన్ రాడ్డును అడ్డుగా పెట్టేశారు. పట్టాలపై దీనిని గమనించిన లోకో పైలట్ వెంటనే రైల్ నుఆపేశాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు… రాడ్డును తొలగించి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేశారు. లో