జమ్మూ, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు : ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా మూడు రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత దిక్కుతోచని పాకిస్తాన్… సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులను అధికారులు, ఆర్మీ అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి బయటి ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని సూచిస్తున్నారు. కొందరైతే స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యేకంగా మూడు రైళ్లు నడపాలని రైల్వే నిర్ణయించింది. అయితే.. ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయమని రైల్వే పేర్కొంది.