వక్ఫ్ చట్టం వచ్చేసింది…

కీలకమైన వక్ఫ్‌ సవరణ బిల్లును ఉభయ సభలూ ఆమోదించాయి. మొదట లోక్‌ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వక్ఫ్‌ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో చర్చ ప్రారంభమైంది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంత రాలు వీగి పోయాయి. ఆ తర్వాత రాజ్యసభలోనూ కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బిల్లును ప్రవేశ పెట్టారు. తదనంతరం చర్చను ప్రారంభిం చారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు దీనిపై చర్చించారు. చివరికి రాజ్యసభలోనూ వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదం పొందింది. దీంతో వక్ఫ్‌ బోర్డు ఆధిపత్య ధోరణికి ముగింపు పలికినట్లయింది. వక్ఫ్‌ చట్టం ద్వారా జరిగే దారుణాలకూ ముగింపు పలికినట్లయింది.

వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో వచ్చే మార్పులివీ…

2013లో అప్పటి కాంగ్రెస్‌ సర్కార్‌ వక్ఫ్‌ చట్టాన్ని సవరించి, ముస్లిమేతరుల సొంత భూమిని క్లెయిమ్‌ చేయడానికి వక్ఫ్‌ బోర్డుకి అనుమతినిచ్చింది.  కానీ ప్రస్తుత కొత్త వక్ఫ్‌ సవరణ చట్టం ప్రకారం కనీసం 5 సంవత్సరాల పాటు ఇస్లాంను ఆచరిస్తున్న వారి భూమిని మాత్రమే వక్ఫ్‌ భూమిగా ప్రకటించే అవకాశం వుంటుంది. అంతేకాకుండా వక్ఫ్‌ ఆస్తులన్నీ ఆన్‌ లైన్‌ పోర్టల్‌లోనే నమోదు చేయబడ తాయి. ఆస్తుల వివరాలు అన్నింటినీ 6 నెలలలోపు ప్రకటించాల్సి వుంటుంది.  కాగ్‌ ద్వారా నియమితు లైన ఆడిటర్లు వక్ఫ్‌ ఆస్తుల ఆడిట్‌ నిర్వహిస్తారు. వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. కలెక్టర్‌, ఆ పైన స్థాయి అధికారులు విషయాన్ని పరిశీలిస్తారు. ఇకపై పూర్తి విచారణ జరిగిన తర్వాతే ఏ ఆస్తినైనా వక్ఫ్‌ ఆస్తిగా పరిగణించడం ప్రారంభమవుతుంది.

తాజా చట్టంలో ‘‘వక్ఫ్‌ బై యూజర్‌’’ నిబంధన తొలగించబడిరది. వక్ఫ్‌-అలల్‌-ఔలాద్‌లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్‌ నుండి జిల్లా కలెక్టర్‌కు మారింది. వక్ఫ్‌ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాలి. వక్ఫ్‌ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్‌ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్‌ చేయవచ్చు. సెక్షన్‌ 40 తొలగించబడి, వక్ఫ్‌ బోర్డులు ఏకపక్షంగా ఆస్తు లను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *