ప్రభుత్వ పాఠశాలైతే ఏమి….
అహ్మదాబాద్లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఐదేళ్లుగా దేశంలోని అంతర్జాతీయ జూనియర్ ఫుట్బాల్ జట్టు కోసం నలుగురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను తయారు చేయడం నిజంగా ఊహించ లేనిది. వీరిలో అరుణా చౌహాన్ 2019లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం 2012, 2016, 2019లో నిర్వహించిన గణితం, సైన్స్ ఎగ్జిబిషన్లో ఈ పాఠశాల పిల్లలు రాష్ట్ర స్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు. ప్రఖ్యాత ప్రైవేట్ పాఠశాలలను వెనుకకు తోసి థాల్తేజ్ ప్రైమరీ స్కూల్ నెం.1 విద్యార్థులు అహ్మదాబాద్లోని సైన్స్, క్రీడా రంగంలో అద్భుతాలు సృష్టించారు. ఇక్కడ చదువు తున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి, అడుగడుగునా మార్గనిర్దేశం చేసింది మరెవరో కాదు, ఇదే పాఠశాలలో 2006 నుండి పనిచేస్తూ, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా గౌరవం అందుకున్న ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవక్ మహేష్ భాయ్ ఠక్కర్. మహేష్ భాయ్ పని చేసిన సమయంలో భోపాల్ ప్రభుత్వ పాఠశాల పిల్లలు చరిత్ర సృష్టించారు. ఉత్తమమైన మట్టి ఫ్రిజ్ని తయారు చేయడం ద్వారా 2003 ఉర్జా ఉత్సవ్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నుండి సత్కారం పొందారు.
ఉపాధ్యాయునిగా 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు విజ్ఞానం, ఉచిత విద్య అందించి, ఎంతో మంది కూలీలు, మురికివాడల పిల్లలు బడికి వెళ్లేలా స్ఫూర్తిని నింపడమే కాకుండా పిల్లల తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించారు. దీంతో పాటు పిల్లల తల్లిదండ్రులకు వ్యసనరహిత జీవితాన్ని గడపడానికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ కూడా ఇచ్చేవారు.
మహేష్ భాయ్ తన పాఠశాలలో 5 నుండి 8 తరగతుల పిల్లలందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. 2012లో గ్రామంలోని ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి శాస్త్ర వేత్తగా మారిన శ్రీ కనక్భాయ్ పటేల్ సహాయంతో ‘కమలా బా ఉచిత ట్యూషన్ సెంటర్’’ను ప్రారంభించారు.
ఏడాది పొడవునా నడుస్తున్న ఈ ట్యూషన్ సెంటర్ పూర్తి ఉచితంగా విద్యనందిస్తుంది. సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈ పిల్లలందరినీ సుందర్బన్స్, ఇస్రో, సైన్స్ సిటీ, సెరినిటీ బొటానికల్ గార్డెన్ మొదలైన ప్రదేశాలకు ఏడాదికి అనేకసార్లు ఉచిత విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. మహేష్ భాయ్ ఉదేశ్యంలో ‘‘ఒక గురువు తమ పిల్లల ప్రతిభ పైనే దృష్టి పెట్టాలి.’’ 2011 నుండి నిరంతరంగా సైన్స్ ప్రాజెక్టుల ఆధారంగా ప్రతి సంవత్సరం 15-16 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారంలో ఒక్క రోజు తమ గుడిసెల నుండి బయటకు వచ్చి సంపన్న కుటుంబాల పిల్లలతో కలిసి పూర్తి గౌరవంతో భుజం భుజం కలిపి విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన కేంద్రంలోని ల్యాబ్లో వివిధ ప్రయోగాలు చేస్తారు. ప్రతి విద్యార్థి తన తరగతిలోని సుమారు 40 మంది పిల్లలకు ఉపాధ్యాయుడిగా మారడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుకుంటాడు. సైన్స్ సెంటర్లో పిల్లల ఖర్చు లన్నింటినీ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు భరిస్తాయి. విద్యావ్యాప్తికి ప్రభుత్వంపైనే కాకుండా సమాజం పాత్ర కూడా ఉండాలన్న మహేష్ భాయ్ ఆలోచనకు 27 స్వచ్ఛంద సంస్థల మద్దతు లభించింది. వారి ద్వారానే ఈ పిల్లల అవసరాలన్నీ తీరుతున్నాయి. 2016లో 8వ తరగతి ఉత్తీర్ణులై అంతర్జాతీయ స్థాయిలో సందడి చేసిన జూనియర్ బాలికల జట్టు నేడు థాల్తేజ్కు గర్వకారణం. నేడు స్వీడన్కు చెందిన ూఖఖీ సంస్థ సహకారంతో సైన్స్, కంప్యూటర్, యోగా తరగతుల్లో జ్ఞానాన్ని పొందుతూ రాష్ట్ర స్థాయిలో హిందీ, డ్రాయింగ్ పోటీల్లో పాల్గొంటున్న ఈ చిన్నారుల ఆశయాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో పాల్గొంటున్న చిన్నారులు ప్రతి రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. పిల్లలు చదువు కొనసాగించేందుకు పేదరికం అడ్డంకిగా మారకుండా చూసేందుకు, 8వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి చిన్నారి స్థితిగతులను పట్టించుకోవడం ద్వారా జీరో డ్రాపౌట్ లక్ష్యాన్ని సాధించారు. పిల్లలు, తల్లిదండ్రులు నిరంతరం మహేష్ భాయ్తో సంప్రదిస్తూ ఉంటారు. కోవిడ్ కారణంగా 10, 12 తరగతుల పరీక్షలు ఇచ్చిన తరువాత పిల్లల ముందు పెద్ద సంక్షోభం ఏర్పడిరది. తాము ఏ దిశలో వెళ్ళాలి? ఆసక్తి ఉన్న రంగాల్లోకి వెళ్లేందుకు డబ్బు ఎక్కడి నుంచి పొందాలి? వారు టీచర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంజనీర్ కావాలని కోరుకున్నారు. గత జూన్లో ఈ పిల్లలను ఒకచోట చేర్చి ఒక మానసిక సలహాదారు సహాయంతో, మేధోపర మైన సాధన, విద్యావిషయక సాధన కోసం తనిఖీ చేశారు. అనేక దశల సమావేశాన్ని పూర్తి చేసిన తర్వాత, వారికి మార్గనిర్దేశం చేయడమే కాకుండా, తదుపరి పోటీ పరీక్షల తయారీకి, ప్రవేశం తర్వాత వారి ఫీజుల కోసం 16 మంది బాలికలకు మద్దతు ఇచ్చారు. ఉపాధ్యాయుని జీతం ఎక్కువ కాదు, కానీ అతని ఆలోచన, అతని కృషి, దేశ భవిష్యత్తుకు అనుకూలమైనదై ఉంటే అప్పుడు సమాజం మాత్రమే కాదు, మొత్తం దేశ చిత్రం మారవచ్చు. ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు కార్యకర్త మహేశ్ భాయ్ నిరూపించారు.