’’మహిళా స్నేహపూర్వక పంచాయతీ’’ తో మహిళా సాధికారత దిశగా అడుగులు
ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా ఆర్మీలో కూడా వస్తున్నారు. అలాగే ఆర్థిక స్వావలంబన దిశగా కూడా పొదుపు సంఘాల ద్వారా ముందుకు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల విషయంలో కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇక.. గ్రామాల అభివృద్ధి చేయడంలోనూ మహిళల పాత్రే కీలకం. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా స్నేహపూర్వక పంచాయతీలు’’ (Women friendly panchayeetee) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్నే తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పంచాయతీలను కూడా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పటికే 26 పంచాయతీల ఎంపిక పూర్తైంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆదర్శంగా వుండేలా ఈ పంచాయతీలను తీర్చిదిద్దుతారు. ఈ పంచాయతీలకు కేంద్రం ప్రత్యేక నిధులను కూడా ఇస్తుంది.
ఇక.. ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పంచాయతీల ద్వారా మహిళా సుస్థిరాభివృద్ధి పేరుతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని ‘‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్’’ ప్రాజెక్టులో భాగంగా మిగతా రాష్ట్రాల్లోనూ ప్రవేశపెడుతున్నారు. రాజస్థాన్ లోని సవాయ్ మాదోపూర్, ఉదయ్ పూర్ జిల్లాలు, మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్, రాజగఢ్ జిల్లాల్లో అమలు చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అయితే… ఈ ప్రాంతాలన్నింటిలోనూ మహిళల పాత్ర అధికం. అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా వారి ఆర్థిక పరిపుష్టి జరిగింది. మహిళల సంఖ్య పంచాయతీల్లో పెరగడంతో భారీగా మౌలిక సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా జిల్లాకో పంచాయతీని ప్రయోగాత్మకంగా కేంద్రం ఎంపిక చేయనుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 26 ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలను ఎంపిక చేసింది. వాటి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది.
ఈ పథకం ద్వారా ఏయే కార్యక్రమాలు జరుగుతాయంటే
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం
2. మహిళలకు విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి పథకాల అమలు
3. ఇళ్ల నుంచి విధిగా చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వాహణ
4. అంగన్ వాడీ కేంద్రాలకు పిల్లలను విధిగా పంపడం
5. ఉపాధి హామీ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవడం
6. ఆర్థిక సంఘం నిధులను గ్రామాభివృద్ధికి సమర్థంగా వినియోగించుకోవడం
7. బాల్య వివాహాలు, శిశు మరణాల నియంత్రణకు చర్యలు
8. వ్యసనాల్లేని ఆదర్శ గ్రామాలకు మార్చడం.