మూలికలతో సహజ సిద్ధమైన రంగులు… స్వయం సహాయక గ్రూపుల మహిళల సరికొత్త ప్రయోగం

హోళీ పండగ వచ్చేస్తోంది. హాని కలిగించే రంగులు కాకుండా పర్యావరణ అనుకూలమైన రంగులనే వాడాలని చాలా రోజులుగా పర్యావరణ వేత్తలు సూచిస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని బలరాం పూర్ లోని స్వయం సహాయక బృంద మహిళలు పర్యావరణ అనుకూలమైన రంగులను తయారు చేస్తోంది. ఇప్పటికే ఓ క్వింటాల్ పర్యావరణ రంగులను తయారు చేశారు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు. వీటిని విక్రయించడానికి స్థానిక మార్కెట్లలో స్టాళ్లు కూడా ఏర్పాటయ్యాయి.

శరీరానికి హాని కలిగించకుండా, పర్యావరణ హితమైన రంగులను తయారు చేసినట్లు మహిళలు పేర్కొన్నారు. ఈ పర్యావరణ హితమైన రంగుల తయారీలో బీట్ రూట్, పలాష్ పువ్వులతో పాటు ఇతర సహజమైన పువ్వులు, సహజమైన పదార్థాలను ఉపయోగించామని వెల్లడించారు.

ఇలా తయారు చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కూడా లభించింది. మూలికలతో కూడిన రంగులను తయారు చేయడం ద్వారా ప్రజలు కూడా కొనుగోలు చేయడానికి సుముఖంగా వున్నారు. ప్రజలు రసాయనాలతో కూడిన రంగులు కూడా పర్యావరణ హితమైన రంగులు వాడితే ఆరోగ్యంగా వుంటారని తెలిపారు.

మరోవైపు యూపీలో ఇప్పటి నుంచే హోళీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బర్సానాలోని శ్రీ లాడ్లీజీ ఆలయంలో లాత్ మార్ హోలీ ప్రారంభమైంది. పురాతన సంప్రదాయం ప్రకారం పర్యావరణ హితమైన రంగులు చల్లుకోవడం, సంప్రదాయంగా వస్తున్న భజనలో కూడా పాల్గొంటున్నారు. భక్తి పాటలు కూడా వేస్తున్నారు. మరోవైపు ‘‘లథ్మార్ హోళీ’’ కూడా ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం మహిళలు సరదాగా పురుషులను కర్రలతో కొడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *