ధర్మ కార్యమే ప్రధానం

1911లో మహారాష్ట్రలోని రత్నగిరి (ఒజర్ఖోల్)లో జన్మించిన శ్రీ మాధవరావ్ మూలే గారు 1973లో ఆర్ ఎస్ ఎస్ సర్-కార్యవాహ బాధ్యతలు స్వీకరించారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో RSSపై నిషేధం విధించినప్పుడు, సర్-కార్యవాహ మాధవరావ్ మూలే గారు అరెస్టు కాకుండా భూగర్భంలోకి వెళ్లారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పోలీసుల నిఘా ఉన్నప్పటికీ… తన వేషధారణ, పేర్లు మారుస్తూ దేశమంతటా రహస్యంగా పర్యటించి, స్వయంసేవకులను ఒకతాటిపైకి తెస్తూ ‘లోకసంఘర్ష సమితి’ ద్వారా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నడిపారు.

తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ఒక కార్యకర్త విశ్రాంతి తీసుకోమని కోరగా… “నా ఆరోగ్యం కంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడటమే పెద్ద బాధ్యత. సంఘం ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నంత కాలం నా శ్వాస ఆగిపోయినా పర్లేదు, కానీ కార్యం మాత్రం ఆగకూడదు” అని స్పష్టం చేశారు.
పోలీసులకు దొరక్కుండా ఎమర్జెన్సీ కాలంలో వేలాది మంది కార్యకర్తలకు ధైర్యం నూరిపోసిన వారి నాయకత్వం, ‘ధర్మకార్యం ముందు ప్రాణం తృణప్రాణం’ అనే భావన సంఘ చరిత్రలో నిరంతరం స్ఫూర్తినిస్తుంది. చివరి రోజుల్లో వారు అనారోగ్యంతో ఢిల్లీలోని ఒక నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ 1984 సెప్టెంబర్ 30న మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *